పాలకులం కాదు ప్రజలకు సేవకులం : నాలుగవసారి బడ్జెట్ని ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క
తె లంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావధిగా, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రజా ప్రభుత్వంలో నాలుగవసారి 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ని ప్రవేశపెట్టే అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రజానీకానికి, ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకత్వానికి ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. శాసనసభలో భట్టి విక్రమార్క ప్రసంగిస్తూ ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే పరిపాలన లక్ష్యమన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలతో తాము పాలన సాగిస్తున్నాం. తాము పాలకులం కాదు ప్రజలకు సేవకులం. ప్రజలు తమకు అప్పగించిన ఈ అధికారాన్ని ఒక బాధ్యతగా భావించి ప్రజాసంక్షేమ, అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకుపోతున్నాం. రెండేళ్ల పాలనలో ప్రజలకు తామిచ్చిన వాగ్దానాలను సంతృప్తికరమైన స్థాయిలో నెరవేరుస్తూ వస్తున్నాం.. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక, వ్యవస్థల విధ్వంసాన్ని సరిచేస్తూ పాత అప్పులను, వా-కి వడ్డీలను కట్టుకుంటూనే పాలనను గాడిలో పెట్టాం.. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం.. అభి...