Posts

Showing posts with the label construction is planned in two major phases

భోగాపురం సమీపంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏఐ హబ్

Image
ఆం ధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలో  రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.08 లక్షల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన మెగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ పనులు వేగంగా అడుగులు వేస్తున్నాయి. రాష్ట్రంలో అత్యంత కీలకమైన డిజిటల్ మౌలిక వసతుల కల్పన దిశగా ఈ ప్రాజెక్ట్ మైలురాయిగా నిలవనుంది. ఈ భారీ డేటా సెంటర్ నిర్వాహక అవసరాల కోసం అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా సర్వర్ల కూలింగ్ వ్యవస్థ కోసం కోనాడ తీరం నుంచి సముద్రపు నీటిని పైప్‌లైన్ ద్వారా డేటా సెంటర్‌కు తరలించనున్నారు. ఆ సముద్రపు నీటిని ప్రాసెస్ చేసి, పర్యావరణ అనుకూల రీతిలో కూలింగ్ ప్రక్రియకు ఉపయోగించేలా ప్రత్యేకమైన సాంకేతిక మౌలిక వసతులను రూపొందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మెగా ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా భావించి సుమారు 855 ఎకరాల భూమిని కేటాయించింది. మొత్తం 1.5 గిగావాట్ల భారీ విద్యుత్ సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ పనిచేయనుంది. దేశంలోనే అతిపెద్ద ఏఐ ఆధారిత డేటా ప్రాసెసింగ్ హబ్‌లలో එකగా ఇది అవతరించనుంది. ప్రాజెక్ట్ నిర్మాణ పనులను రెండు ప్రధాన విడతల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున...