తెలంగాణలో 'ఆపరేషన్ ముస్కాన్' : నిబంధనలను ఉల్లంఘించి చిన్నారులతో పనిచేయిస్తున్న ప్రాంతాలపై పోలీసులు దాడులు
బా లకార్మిక వ్యవస్థను నిర్మూలించడమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం అద్భుత ఫలితాలను అందించింది. జులై 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నెల రోజుల పాటు రాష్ట్ర పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలిసి హోటళ్లు, టీ కొట్లు, ఇటుక బట్టీలు, భవన నిర్మాణ ప్రాంతాలు, మెకానిక్ షాపులు, కిరాణా దుకాణాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. నిబంధనలను ఉల్లంఘించి చిన్నారులతో పనిచేయిస్తున్న ప్రాంతాలపై దాడులు చేసి, ప్రమాదకర పరిస్థితుల్లో నలిగిపోతున్న వేలాది మంది చిన్నారులకు విముక్తి కల్పించారు. ఈ ప్రత్యేక సోదాల్లో పోలీసులు మొత్తం 6,307 మంది చిన్నారులను సురక్షితంగా రక్షించారు. వీరిలో 5,892 మంది బాలురు కాగా, 415 మంది బాలికలు ఉన్నారు. కాపాడబడిన వారిలో తెలంగాణకు చెందినవారు 3,447 మంది ఉండగా, పొరుగు దేశమైన నేపాల్కు చెందినవారు 2,860 మంది ఉన్నారు. రక్షించిన చిన్నారుల్లో 5,737 మందిని వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చి, వారి ముఖాల్లో చిరునవ్వులు పూయించారు. మిగిలిన 570 మంది చిన్నారులను మెరుగైన భద్రత, విద్య కోసం వివిధ శిశు సంరక్షణ కేంద్రాలకు తరలించారు. బాల కార్మికులను...