Posts

Showing posts with the label Cockroach Janata Party issues another ultimatum to the central government

కేంద్ర ప్రభుత్వానికి కాక్రోచ్ జనతా పార్టీ మరో అల్టిమేటం జారీ : కేసులు విత్ డ్రా చేసుకోకుంటే మళ్లీ దేశవ్యాప్తంగా నిరసనలు

Image
కేంద్ర ప్రభుత్వానికి కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) మంగళవారం మరో అల్టిమేటం ఇచ్చింది. నిరసనలకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత, విద్యార్థి నిరసనకారులపై ఎఫ్ఐఆర్‌లు ఉపసంహరించుకోవాలనే హామీపై కేంద్రం వెనక్కి తగ్గుతోందని సీజేపీ ఆరోపించింది. మంగళవారం లోగా కేసులు విత్ డ్రా చేసుకోకుంటే మళ్లీ దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతామని హెచ్చరించింది. మంగళవారం నీట్ పేపర్ లీక్ నిరసనల్లో అరెస్టైన వారిలో 18 ఏళ్లలోపు, నేర చరిత్ర లేని నిర్బంధంలో ఉన్న విద్యార్థులందరినీ విడుదల చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలను ఆదేశించింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద, ఇతర రాష్ట్రాలలో సీజేపీ నేతృత్వంలో జరిగిన నిరసనలకు సంబంధించి నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల విషయంలో ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని కూడా అది ఆదేశించింది. సుప్రీం ఆదేశాల ప్రకారం, ప్రభుత్వాలు ఇప్పటికే ఉన్న ఎఫ్ఐఆర్‌లపై దర్యాప్తు కొనసాగించవచ్చని సీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది.శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరిస్తామని, ఏ విద్యార్థిపైనా ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ శిక్షాత్మక చర్యలు తీసుకోబోమని కేంద్రం హామీ ఇచ్చిందని సీ...