Posts

Showing posts with the label Charge Memos Issued to Police Personnel

సీసీఎస్‌ టీం కళ్లు కప్పి పరారైన దొంగ : పోలీస్‌ సిబ్బందికి ఛార్జ్ మెమో జారీ

Image
\ తె లంగాణలోని నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్య ఆదేశాల మేరకు ట్రాఫిక్‌ పోలీసులు శనివారం డ్రంక్‌ అండ్‌ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో నంబర్‌ లేని బైక్‌ పై వచ్చిన ఇద్దరు అనుమానితులు పోలీసులను చూసి బైక్‌ అక్కడే వదిలేసి పరారయ్యారు. దీంతో ట్రాఫిక్‌ పోలీసులు వారిని వెంబడించగా ఒకరు తప్పించుకుపోగా మరో అనుమానితుడు పోలీసులకు చిక్కాడు. దీంతో అతని తనిఖీ చేయగా అతడి వద్ద బంగారు గొలుసు లభించడంతో అనుమానితునితోపాటు, బైక్‌ ను సైతం తదుపరి విచారణ నిమిత్తం సెంట్రల్‌ క్రై స్టేషన్‌ పోలీసులకు అప్పగించారు. పోలీసుల అదుపులో ఉన్న సదరు నిందితుని విచారించగా అతడు కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలానికి చెందినవాడిగా పోలీసుల విచారణలో అంగీకరించారు. అయితే సదరు నిందితుడి వెంట ఉండి పరారైన మరో అనుమానితుడు అతడి సమీప బంధువేనని పోలీసుల విచారణలో తేలింది. అయితే అదుపులో ఉన్న అనుమానితుడి వద్ద లభించిన బంగారు గొలుసు ఎక్కడికైనా విచారించగా నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండల పరిధిలో ఓ మహిళ వద్ద నుండి చోరీ చేసినట్లుగా సీసీఎస్‌ పోలీసుల విచారణలో అనుమానితుడు అంగీకరించినట్లు తెలిసింది. పరారైన మరో నిందితుడిని పట్టుకునేందుకు ప...