యోగ రాజధానిగా అమరావతి : బాబా రామ్దేవ్
అ మరావతి వేదికగా నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యోగా కేవలం ఒక వ్యాయామ విధానం మాత్రమే కాకుండా భారతదేశానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగాకు పెరుగుతున్న ఆదరణ భారతీయ సంస్కృతి గొప్పతనానికి నిదర్శనమని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించినప్పటికీ, తాను "యోగ అతిథిగా" వచ్చానని రామ్దేవ్ వ్యాఖ్యానించారు. యోగాను ప్రజల జీవనశైలిలో భాగంగా మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఆయన అభినందించారు. యోగాంధ్ర కార్యక్రమం ద్వారా యోగా పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు తరహాలో దేశంలోని ప్రతి ముఖ్యమంత్రి పనిచేస్తే "వికసిత్ భారత్-2047" లక్ష్యం నిర్దేశించిన గడువుకంటే ముందుగానే సాకారం అవుతుందని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి, పరిపాలన, భవిష్యత్ దృష్టితో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. అమరావతి గురించి మాట్లాడిన రామ్దేవ్, ఇది ఒకప్పుడు దేవతల రాజధానిగా ప్ర...