డాక్టర్ నూతన్ నాయుడుకు ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ శాంతి మండలి అత్యున్నత పురస్కారం
ప్ర పంచ శాంతి, సాంకేతిక నైతికత, సామాజిక సామరస్యం కోసం నిరంతరం కృషి చేస్తున్నందుకు ప్రొఫెసర్ డాక్టర్ నూతన్ నాయుడుకు ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ శాంతి మండలి ప్రతిష్టాత్మకమైన టిటులర్ హానర్స్ పురస్కారాన్ని అందజేసింది. ఈ అంతర్జాతీయ పురస్కారం భారతదేశ కీర్తి పటాన్ని ప్రపంచ వేదికపై మరోసారి నిలిపింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలలో విశేష సేవలందించిన అంతర్జాతీయ ప్రముఖుల సమక్షంలో ఈ సన్మాన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. విశాఖపట్నం మట్టిలో జన్మించిన డాక్టర్ నూతన్ నాయుడు.. ఒక సాధారణ పౌరుడి స్థాయి నుండి అంతర్జాతీయంగా స్థాయికి ఎదగడం అద్భుతమనే చెప్పాలి. డాక్టర్ నూతన్ నాయుడు చదువు, పరిశోధనల రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచంలోని 17 ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ ప్రొఫెసర్షిప్లతో పాటు డాక్టరేట్లను కూడా అందజేశాయి. హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్గనైజేషనల్ న్యూరోసైన్స్, AI ఎథిక్స్ వంటి కష్టమైన సబ్జెక్టులలో ఇంతటి గొప్ప గౌరవాన్ని సాధించిన మొట్టమొదటి భారతీయ విద్యావేత్త ఆయనే. మన దేశంలోని ఐఐటీ కాన్పూర్, ఐఐఎం కలకత్తా, ఉస్మానియా, ఆంధ్ర విశ్వవిద్యాలయాలతో పాటు ప్రపం...