నాలుగు ప్రధాన కొత్త లేబర్ కోడ్లను అమలు లోకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం ఎన్నో దశాబ్దాలుగా ఉన్న పాత కార్మిక చట్టాలను మార్చి నాలుగు ప్రధానమైన కొత్త లేబర్ కోడ్లను అమలు లోకి తెచ్చింది. ఈ సంస్కరణల ద్వారా సుమారు 40 కోట్లకు పైగా కార్మికులకు కనీస వేతనాలు, సామాజిక భద్రత, గ్రాట్యుటీ వంటి ముఖ్యమైన హామీలు లభించనున్నాయి. ఆత్మనిర్భర్ భారత్, వికసిత భారత్ 2047 లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం ఈ కొత్త నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని రంగాల కార్మికులకు సరైన సమయంలో కనీస వేతనం తప్పనిసరిగా చెల్లించాలి. యువతకు అలాగే కొత్తగా చేరిన వారందరికీ తప్పనిసరిగా అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి. దీనివల్ల జాబ్ సేఫ్టీ పెరుతుంది. స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం తప్పనిసరి. అలాగే మహిళలుకు రాత్రి షిఫ్ట్లలో పని చేయడానికి అనుమతి. 40 కోట్ల మందికి పైగా ఉన్న నాన్ యూనియన్ కార్మికులకు, గిగ్ కార్మికులు, ప్లాట్ఫామ్ కార్మికులకు కూడా పీఎఫ్,ఈఎస్ఐసి,బీమా మొదలైనవి వర్తిస్తాయి.ఫిక్స్డ్ -టర్మ్ ఉద్యోగులకు ఐదేళ్ల బదులు ఒక్క సంవత్సరం పని తర్వాతే గ్రాట్యుటీకి అర్హత ఉంటుంది. నిర్ణీత సమయం కంటే అదనంగా పనిచేసినందుకు రెట్టింపు వేతనం చెల్లించాలి. 40 ఏళ్లు పైబడిన కార్మికులందరికీ యాజమాన్యం ద్వారా ఉచిత...