ఏప్రిల్ 9న నోవా 2 5G, నోవా 2 అల్ట్రా 5G స్మార్ట్ఫోన్లు విడుదల
దే శీయ మార్కెట్లో ఏప్రిల్ 9న ఏఐ+ త్వరలో రెండు కొత్త స్మార్ట్ఫోన్లను విడుదల చేయబోతోంది. ఈ సంస్థ బడ్జెట్ ధరలలో ఏఐ+ నోవా 2 5G, నోవా 2 అల్ట్రా 5G స్మార్ట్ఫోన్లను విడుదల చేయనుంది. నోవా సిరీస్కు చెందిన రాబోయే స్మార్ట్ఫోన్లు 5 కలర్ ఆప్షన్స్ లో అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. అంతకుముందు, ఈ సంస్థ గత సంవత్సరం జూలైలో నోవా 5G స్మార్ట్ఫోన్ సిరీస్ను విడుదల చేసింది. నోవా 2 5G, నోవా 2 అల్ట్రా 5G స్మార్ట్ఫోన్లు భారత్ లో విడుదల కానున్నాయని మాధవ్ సేథ్ ‘X’ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ధృవీకరించారు. టీజర్ ప్రకారం, నోవా 2 అల్ట్రా 5G బ్లాక్, బ్లూ, గ్రీన్, పర్పుల్, రెడ్ కలర్ లో లభిస్తుంది. నోవా 2 5G బ్లాక్, బ్లూ, గ్రీన్, పింక్, పర్పుల్ షేడ్స్లో వస్తుంది. ఈ రెండు నోవా సిరీస్ స్మార్ట్ఫోన్లలో రెడ్ పవర్ బటన్ ఉంటుంది. ఏఐ+ నోవా 2 అల్ట్రా 5G స్మార్ట్ఫోన్లో పిల్ షేప్ లో ఉండే రియర్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది. ఈ ఫోన్లో LED ఫ్లాష్ ఉంది. రాబోయే ఏఐ+ ఫోన్లో రింగ్ లైట్ కూడా ఉంది, ఇది కాల్స్, మెసేజ్లు, మ్యూజిక్, ఇతర నోటిఫికేషన్లను హైలైట్ చేస్తుంది. ఇది కొంతవరకు నథింగ్ ఫోన్ను పోలి ఉంటుంది. కంపెనీ ఈ స్మార్ట్...