Posts

Showing posts with the label Board Secretary P. Ranjit Basha

ఏప్రిల్ 1 నుంచి ఇంటర్మీడియట్ దరఖాస్తుల స్వీకరణ

Image
ఆం ధ్రప్రదేశ్ లో  2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల ఇంటర్మీడియట్ (జనరల్ & వొకేషనల్) కోర్సుల ప్రవేశాల షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారికంగా విడుదల చేసింది. ఇంటర్ బోర్డు కార్యదర్శి పి. రంజిత్ బాషా ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జూనియర్ కళాశాలలు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఏప్రిల్ 1వ తేదీ నుంచే విద్యార్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇక అసలైన ప్రవేశాల ప్రక్రియ ఏప్రిల్ 6వ తేదీ నుంచి మొదలై జూన్ 1వ తేదీ వరకు కొనసాగుతుంది. అడ్మిషన్లు పూర్తి చేయడానికి జూన్ 1వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించారు. ప్రవేశాల ప్రక్రియ ముగిసిన వెంటనే, అదే రోజు అంటే జూన్ 1 నుంచే జూనియర్ కళాశాలల్లో క్రమబద్ధమైన తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ అడ్మిషన్ల షెడ్యూల్ రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలకు వర్తిస్తుందని బోర్డు స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, అన్-ఎయిడెడ్, కో-ఆపరేటివ్, రెసిడెన్షియల్, సాంఘిక మరియు గిరిజన సంక్షేమ కళాశాలలతో పాటు మోడల్ స్కూల్స్, ఇంటర్ కోర్సులు అందించే డిగ్ర...