జంగారెడ్డిగూడెం గోల్డ్ లోన్ స్కామ్ కేసు : మాజీ బ్రాంచ్ మేనేజర్ సహా ముగ్గురు అధికారుల అరెస్ట్
ఆం ధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో వెలుగుచూసిన భారీ గోల్డ్ లోన్ కుంభకోణం కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను మాయం చేసి, వాటి స్థానంలో నకిలీ నగలు, పనికిరాని వస్తువులను ప్యాకెట్లలో ఉంచినట్లు వెలుగులోకి వచ్చిన ఈ కేసులో బ్యాంక్ మాజీ బ్రాంచ్ మేనేజర్ సహా ముగ్గురు అధికారులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తు ప్రకారం మొత్తం 176 గోల్డ్ లోన్ ఖాతాల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. సుమారు 6 కిలోల 449.50 గ్రాముల బంగారు ఆభరణాలు గల్లంతైనట్లు అధికారులు అంచనా వేశారు. వీటి మార్కెట్ విలువ రూ.10 కోట్లకు పైగా ఉంటుందని చెబుతున్నారు. ఈ వ్యవహారంలో 2016 నుంచి బ్యాంకులో గోల్డ్ అప్రైజర్గా పనిచేస్తున్న చలపాక రాజు కీలక నిందితుడిగా తేల్చారు. 2025 మేలో బ్రాంచ్ మేనేజర్గా కుమారపు భాస్కరరావు, జాయింట్ మేనేజర్గా తన్నేరు అజయ్బాబు బాధ్యతలు చేపట్టగా.. అదే ఏడాది అక్టోబర్లో జంగల సాయిరాజ్ క్రెడిట్ ఆఫీసర్గా చేరారు. వీరు అప్రైజర్తో కుమ్మక్కై బంగారం మాయం చేయడానికి సహకరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఈ వ్...