70% అమౌంట్ మొదట చెల్లించి టీవీ తీసుకెళ్లండి !
శాంసంగ్ ప్రీమియం టీవీలపై బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. టీవీని ఇంటికి తీసుకెళ్లాలంటే ఆ టీవీ ధరలో 70 శాతం అమౌంట్ మొదటగా చెల్లిస్తే సరిపోతుందని. మిగిలిన 30 శాతం ఓ ఏడాది తర్వాత చెల్లించవచ్చని బంపరాఫర్ ఇచ్చింది. నియో QLED, ది ఫ్రేమ్ & క్రిస్టల్ UHD వంటి టీవీలపై ఈ బంపరాఫర్ తీసుకొచ్చింది. ఈ మేరకు ఫ్లిప్కార్ట్తో కలిసి 'స్మార్ట్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్ ని శాంసంగ్ ప్రకటించింది. ఈ స్మార్ట్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్ ప్రకారం, టీవీని కొనుగోలు చేసేటప్పుడు 70%,12 నెలల తర్వాత మిగిలిన 30% చెల్లిస్తే సరిపోతుంది. పాత టీవీల నుంచి ప్రీమియం శాంసంగ్ టీవీలకు అప్గ్రేడ్ కావాలనుకునే వారి కోసమే స్మార్ట్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్ పరిచయం చేసినట్లు శాంసంగ్ తెలిపింది. ఒకేసారి మొత్తం అమౌంట్ చెల్లించే స్థోమత లేని వారికీ ఈ ప్రోగ్రామ్ ప్రయోజనకరంగా ఉంటుంది. రూ.23,093 చెల్లించి శాంసంగ్ క్రిస్టల్ 4K UHD టీవీ తీసుకెళ్లచ్చు ఈ ప్రోగ్రామ్ కింద, వినియోగదారులు రూ.23,093 ముందస్తు చెల్లింపుగా చెల్లించి, 12 నెలల తర్వాత మిగిలిన రూ.9,897 చెల్లించి శాంసంగ్ క్రిస్టల్ 4K UHD టీవీని కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ ఫ్రేమ్ 2021 సిరీస్ QLED అల్ట్ర...