పేపర్ గోల్డ్ పై కఠిన ఆంక్షలు విధించిన చైనా
ప్ర పంచంలోనే అతిపెద్ద బంగారం వినియోగ దేశాలలో ఒకటైన చైనా, పేపర్ గోల్డ్ వ్యాపారంపై ఊహించని విధంగా కఠిన ఆంక్షలు విధించింది. ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనాతో పాటు ఆ దేశంలోని దాదాపు 90 శాతం బ్యాంకులు షాంఘై గోల్డ్ ఎక్స్ఛేంజ్తో ముడిపడి ఉన్న పలు ఫైనాన్షియల్ డెరివేటివ్స్ ట్రేడింగ్ను తక్షణమే నిలిపివేశాయి. ముఖ్యంగా లీవరేజ్ ఆధారిత స్పాట్ కాంట్రాక్టులు.. డిఫర్డ్ కాంట్రాక్టుల సేవల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడమే కాకుండా, తమ ఖాతాదారులను వెంటనే పొజిషన్లను క్లోజ్ చేయాలని లేదా భౌతిక బంగారాన్ని డెలివరీ తీసుకోవాలని స్పష్టం చేశాయి. చైనా తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం వెనుక బలమైన ఆర్థిక వ్యూహాలు, రిస్క్ మేనేజ్మెంట్ దాగి ఉన్నాయి. సాధారణంగా పేపర్ గోల్డ్ వ్యాపారంలో ‘లీవరేజ్’ విధానాన్ని విరివిగా ఉపయోగిస్తుంటారు. అంటే ఇన్వెస్టర్లు స్వల్ప మొత్తంలో మార్జిన్ మనీని చెల్లించి.. మార్కెట్లో చాలా పెద్ద పరిమాణంలో గోల్డ్ పొజిషన్లను కొనుగోలు చేస్తుంటారు. ప్రతికూల పరిస్థితుల్లో బంగారం ధరలు హఠాత్తుగా పడిపోతే.. ఈ లీవరేజ్ ట్రేడింగ్ వల్ల ఇన్వెస్టర్లతో పాటు బ్యాంకులు కూడా భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ రకమైన ఊహ...