రేపటి నుండి పెరగనున్న సిమెంట్ ధరలు : బస్తాపై రూ. 30 నుండి రూ. 50 వరకు పెంపు
దే శవ్యాప్తంగా సిమెంట్ ధరలు రేపటి నుండి భారీగా పెరగనున్నాయి. సిమెంట్ కంపెనీలు బస్తాపై సుమారు రూ. 30 నుండి రూ. 50 వరకు పెంచుతున్నట్లు డీలర్లకు ఇప్పటికే సమాచారం అందించాయి. ఈ పెంపుతో మార్కెట్లో 50 కేజీల బస్తా ధర రూ. 360 వరకు చేరే అవకాశం కనిపిస్తోంది. రవాణా ఖర్చులు మరియు ముడి సరుకుల ధరలు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వినియోగదారులు పాత ధరలకే స్టాక్ కొనుగోలు చేసేందుకు నేడు ఆసక్తి చూపిస్తున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం ప్రభావం ఇప్పుడు సిమెంట్ రంగంపై కూడా పడింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో రవాణా వ్యవస్థ ఖరీదుగా మారింది. దీనివల్ల ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ధరల పెంపు ప్రభావం ఎక్కువగా ఉండనుంది. మరో వారం రోజుల్లో ఈ కొత్త ధరలు పూర్తిస్థాయిలో అమలులోకి వస్తాయనిమార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. నిర్మాణ రంగంపై ఈ పెంపు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరల పెంపు నేపథ్యంలో సిమెంట్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. మార్చి 31వ తేదీన కొత్త బుకింగ్లను నిలిపివేసి, పాత ధరలపై ఉన్న ఆర్డర్లను మాత్రమే క్లియర్ చేశాయి. ...