Posts

Showing posts with the label budget for misleading the people

బడ్జెట్ ప్రసంగం అంతా 'ఆత్మస్తుతి - పరనింద' అన్న చందంగా సాగింది !

Image
ఆం ధ్రప్రదేశ్  లోని శాసనమండలి మీడియా పాయింట్ వద్ద వైఎస్సార్ సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఈ బడ్జెట్ ప్రజలను వంచించేలా ఉందంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. బడ్జెట్ ప్రసంగం అంతా 'ఆత్మస్తుతి - పరనింద' అన్న చందంగా సాగిందని ఎద్దేవా చేశారు. ప్రతి ఇంట్లో ఒక మహిళను పారిశ్రామికవేత్తగా మారుస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై బొత్స మండిపడ్డారు. "గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పావలా వడ్డీ పథకంతో డ్వాక్రా సంఘాలకు ప్రాణం పోశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో సున్నా వడ్డీ నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో పడేవి. కానీ ఈ 19 నెలల్లో సున్నా వడ్డీ పథకం ఏమైందో ఎవరికీ తెలియదు. బడ్జెట్‌లో కేటాయింపులు లేకుండా మహిళలను పారిశ్రామికవేత్తలుగా ఎలా మారుస్తారు?" అని ఆయన ప్రశ్నించారు. గ్రామీణాభివృద్ధికి వెన్నెముక లాంటి ఉపాధి హామీ పథకం నిధుల విషయంలో ప్రభుత్వం కోత పెట్టిందని బొత్స ఆరోపించారు. కేంద్ర నిబంధనల ప్రకారం రాష్ట్రం భరించాల్సిన 40 శాతం వాటా కింద రూ. 2,000 కోట్లు కేటాయించాల్సి ఉండగా, కేవలం రూ. 500 కోట్లు మాత్రమే చూపించారని విమర్శించారు. మిగిలిన నిధుల సంగతేంటని, ఈ పథకాన్ని నీరుగార్చడమే ప్రభుత్వ ఉద్దేశమా అ...