ఏఈ నూకరాజు కేసు : సాదిక్ ఖాన్ మూడు రోజుల పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతి
ఆం ధ్రప్రదేశ్ లో తీవ్ర కలకలం రేపిన అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు దర్యాప్తులో కీలక పురోగతి సాధించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సాదిక్ ఖాన్ను సర్పవరం పోలీసులు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం తీవ్ర భద్రత నడుమ సర్పవరం పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ ప్రారంభించారు. ఈ కేసులోని మరిన్ని రహస్యాలు, కీలక ఆధారాలు రాబట్టేందుకు సాదిక్ ఖాన్ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సర్పవరం పోలీసులు ఇటీవల కాకినాడ స్పెషల్ మొబైల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల విజ్ఞప్తిని, కేసు తీవ్రతను పరిశీలించిన న్యాయస్థానం సెప్టెంబర్ 9 నుంచి 11 వరకు మూడు రోజుల పాటు సాదిక్ ఖాన్ను పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మూడు రోజుల కస్టడీ సమయంలో పోలీసులు సాదిక్ ఖాన్ను వివిధ అంశాలపై లోతుగా విచారించనున్నారు. ముఖ్యంగా ఏఈ నూకరాజు కుటుంబాన్ని ఆత్మహత్యకు ప్రేరేపించిన ఘటనల వెనుక ఉన్న అసలు కారణాలు, ఆర్థిక లావాదేవీలు మరియు ఈ వ్యవహారంలో ఇతర వ్యక్తుల ప్రమేయం ఏదైనా ఉందా అనే కోణాల్లో ప్రశ్నల వర్షం కురిపించనున్నారు. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తులో పలు...