Posts

Showing posts with the label Amit Shah is afraid of discussion on SIR

ఎస్‌ఐఆర్‌పై చర్చకు అమిత్‌ షా భయపడుతున్నారు : రాహుల్‌ గాంధీ

Image
ఓట్‌ చోరీ వ్యవహారంపై లోక్‌సభలో రాహుల్‌ గాంధీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ అంశంపై చర్చకు రావాలంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాకు లోక్‌సభ విపక్ష నేత రాహుల్‌ గాంధీ సవాల్‌ విసిరారు. లోక్‌సభలో ఎస్‌ఐఆర్‌పై చర్చకు అమిత్‌ షా భయపడుతున్నారు. మొదటిసారి ఈసీకి పూర్తి ఇమ్యూనిటీ ఇచ్చారు. హర్యానాలో 19 లక్షల నకిలీ ఓటర్లు ఉన్నారు. ఓట్ల చోరీ వ్యవహారంలో నా ఆరోపణలకు జవాబివ్వగలారా? చర్చకు సిద్ధమా? అని రాహుల్‌ అన్నారు. దీనికి అమిత్‌ షా స్పందిస్తూ నేను ఎప్పుడు మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో ఎవరూ నిర్ణయించలేరు. వాళ్లకు (రాహుల్‌ను ఉద్దేశించి) కాస్త సహనం ఉండాలి. అన్ని ప్రశ్నలకు జవాబిస్తా. ధైర్యంగా ఉండాలి. రాహుల్‌ గాంధీ ఓట్‌ చోరీ పేరిట హైడ్రోజన్‌ బాంబు వేశారు. హర్యానాలో నకిలీ ఓటర్లు ఉన్నారని అంటున్నారు. కానీ, అక్కడ ఎలాంటి నకిలీ ఓటర్లు లేరు. నెహ్రూ హయాంలోనే ఓట్‌ చోరీ జరిగింది. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌కు మెజారిటీ వచ్చినా, నెహ్రూనే ప్రధాని అయ్యారు. ప్రధాని విషయంలో నెహ్రూ ఓట్‌ చోరీకి పాల్పడ్డారు. అలహాబాద్‌లో ఇందిరా గాంధీ ఓట్‌ చోరీకి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. సోనియా గాంధీ భారత పౌరురాలు ...