తెహల్కా మాజీ ఎడిటర్-ఇన్-చీఫ్ తరుణ్ తేజ్పాల్ను దోషిగా నిర్ధారిస్తూ బాంబే హైకోర్టు తీర్పు
తె హల్కా మాజీ ఎడిటర్-ఇన్-చీఫ్ తరుణ్ తేజ్పాల్ను దోషిగా నిర్ధారిస్తూ బాంబే హైకోర్టు గోవా బెంచ్ గురువారం తీర్పు వెలువరించింది. మే 2021లో మాపుసా సెషన్స్ కోర్టు తేజ్పాల్ను నిర్దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం (జస్టిస్ డాక్టర్ నీలా గోఖలే, జస్టిస్ అమిత్ జమ్సాండేకర్) కొట్టివేసింది. గోవా ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ను అనుమతించిన కోర్టు.. తేజ్పాల్పై మోపబడిన భారతీయ శిక్షా స్మృతి (IPC) సెక్షన్లు 376(2)(f), 376(2)(k) (అత్యాచారం), 354A, 354B (లైంగిక వేధింపులు) కింద ఆయన్ను దోషిగా ప్రకటించింది. సిఐడి, సోలిసిటర్ జనరల్ వాదనలు:గోవా సిఐడి తరఫున హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అడ్వకేట్ జనరల్ దేవిదాస్ పంగమ్ వాదిస్తూ.. సెషన్స్ కోర్టు నిందితుడి నేరాన్ని పరిశీలించకుండా, బాధితురాలి ప్రవర్తనను, నేరం జరిగిన తర్వాత ఆమె ప్రతిస్పందనను విచారణకు గురిచేసిందని ఆరోపించారు. నిందితుడు బాధితురాలికి పంపిన 'క్షమాపణ ఈమెయిల్' వంటి కీలక ఆధారాలను విచారణ కోర్టు విస్మరించిందని పేర్కొన్నారు."ఒక యువతి 'నో' (కాదు/వద్దు) అని చెబితే దానికి అర్థం 'నో' అని చెప్పడమే అనే...