యూపీలో బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత 26 వేల ప్రభుత్వ పాఠశాల మూసేవేత !
ఉ త్తరప్రదేశ్, లక్నోలోని సమాజ్వాదీ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 26 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీలైన 'పీడీఏ' వర్గాల పిల్లలకు విద్యను దూరం చేయడమే ఈ చర్య ఉద్దేశమని ఆయన విమర్శించారు. అధికారిక గణాంకాల ప్రకారం బీజేపీ అధికారంలోకి వచ్చిన 2017 మార్చి నాటికి ఉత్తరప్రదేశ్లో 1,13,938 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉండేవని తెలిపారు. అయితే అప్పటి నుంచి 26,000కు పైగా పాఠశాలలు మూతపడ్డాయని ఆరోపించారు. అత్యధికంగా లఖింపూర్ ఖేరీలో 758, సీతాపూర్లో 650, ప్రయాగ్రాజ్లో 638, సీఎం ఆదిత్యనాథ్ సొంత జిల్లా అయిన గోరఖ్పూర్లో కూడా సుమారు 500 ప్రాథమిక స్కూళ్లను మూసివేసినట్లు అఖిలేష్ యాదవ్ విమర్శించారు. వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీలైన 'పీడీఏ' వర్గాల పిల్లలకు విద్యను దూరం చేయడమే ఈ చర్య ఉద్దేశమని ఆయన మండిపడ్డారు. కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్య 2017లో 1.17 కోట్లు ఉండగా, 2026 నాటికి ...