పెనుమాక రైతులకు ఈ-లాటరీ పద్ధతి ద్వారా ప్లాట్ల కేటాయింపు : ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేసిన అధికారులు
అ మరావతి రాజధాని ప్రాంతంలోని పెనుమాక గ్రామానికి చెందిన రైతులకు ఈ-లాటరీ పద్ధతి ద్వారా ప్లాట్లను కేటాయించి, వారికి సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికెట్లను అధికారికంగా అందజేశారు. ఈ తాజా విడత కేటాయింపు ప్రక్రియలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ పూర్తిగా ఈ-లాటరీ విధానాన్ని అనుసరించారు. దీనిద్వారా పెనుమాక గ్రామానికి చెందిన మొత్తం 18 మంది అర్హులైన రైతులను ఎంపిక చేసి, వారికి మొత్తంగా 28 ప్లాట్లను కేటాయించడం జరిగింది. కేటాయించిన వాటిలో 19 రెసిడెన్షియల్ ప్లాట్లు ఉండగా, మరో 9 కమర్షియల్ ప్లాట్లు ఉన్నాయి. రాజధాని మాస్టర్ ప్లాన్, భూసమీకరణ నిబంధనల ప్రకారం రైతులకు ఎంత భూమి రావాల్సి ఉందో, ఆ మేరకే ఈ ప్లాట్ల కేటాయింపు సజావుగా సాగిందని అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా, గతంలో కొందరికి కేటాయించిన ప్లాట్లలో కొన్ని సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. వీధి పోటు సమస్యలు ఉండటం, వివిధ కోర్టు కేసుల్లో భూములు చిక్కుకోవడం అలాగే భూసేకరణకు సంబంధించిన ఇతర వివాదాలు తదితర కారణాల వల్ల ఇబ్బంది పడుతున్న రైతులకు ఈసారి ప్రత్యేక ప్రత్యామ్నాయాలను చూపించారు. వివాదాస్పదంగా మారిన ఆ ప్లాట్లకు బదులుగా ఎలాంటి చట్టపరమైన చిక్కులు లేని సురక్షితమైన...