Posts

Showing posts with the label 'Panchanama' to stream on ZEE5 starting tomorrow

నిర్మాతగా మారిన యాంకర్ ఉదయభాను : రేపటి నుంచి జీ5లో 'పంచనామా' స్ట్రీమింగ్

Image
తె లుగు బుల్లితెరపై తనదైన యాంకరింగ్‌తో, నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటి ఉదయభాను ఇప్పుడు సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆమె మొదటిసారి నిర్మాతగా మారి 'పంచనామా' అనే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్‌ను రూపొందించారు. ఈ సిరీస్ రేపటి నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఉదయభాను తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈవెంట్‌లో మాట్లాడుతూ ఉదయభాను కన్నీటిపర్యూమ అయ్యారు. తాను ఎంతగానో భావోద్వేగాన్ని అదుపు చేసుకోవాలని అనుకున్నానని, కానీ అస్సలు కుదరలేదని తెలిపారు. నిర్మాతగా మారాలని తాను దాదాపు 15 ఏళ్లుగా ఎంతో తపస్సు చేశానని చెప్పుకొచ్చారు. తన ప్రయాణం టెలివిజన్‌లోనే ప్రారంభమైందని, ఇక్కడే ఉదయభాను అందరి హృదయభానుగా మారిందని గుర్తుచేసుకున్నారు. అందుకే నిర్మాతగా కూడా టెలివిజన్‌తోనే అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు.  మంచి కంటెంట్ ఉందని ఎంతోమందిని కలిసినప్పటికీ పనులు ముందుకు పడలేదని వాపోయారు. వచ్చే నెల, వచ్చే వారం అంటూ కాలం గడిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఇన్నేళ్లు ఎందుకు ఆలస్యమైందనేది తనకూ అంతు...