Posts

Showing posts with the label Center approves Visakhapatnam

విశాఖ, విజయవాడ మెట్రోలకు కేంద్రం ఆమోదం

Image
వి శాఖ, విజయవాడ మెట్రోలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉండగా, కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.  నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ఈ మెట్రో ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరానికి ఇది ఒక కీలకమైన మలుపు కానుంది. వచ్చే ఏడాది చివర్లో పనులు ప్రారంభించి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. విశాఖ మెట్రో మొత్తం 46.23 కిలోమీటర్ల పొడవున ఉంటుంది. ఇందులో మూడు ప్రధాన మార్గాలు (కారిడార్లు) ఉంటాయి. స్టీల్ ప్లాంట్ జంక్షన్ నుంచి కొమ్మాడి వరకు ఒక లైన్, గురుద్వారా జంక్షన్ నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు (5.08 కి.మీ) రెండోది, తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు (6.75 కి.మీ) మూడో లైన్ ఉంటాయి. మొత్తం 42 స్టేషన్లు అన్నీ ఆకాశ మార్గంలోనే (ఎలివేటెడ్) నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టును పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ పద్ధతిలో చేపడతారు. 2025 అక్టోబరు నాటికి సివిల్ పనులు ప్రారంభ...