Posts

Showing posts with the label BRS and Congress Responsible for Losses

సింగరేణి కార్మికుల కష్టాన్ని గుర్తించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి : నష్టాలకు బీఆర్‌ఎస్, కాంగ్రెసే కారణం

Image
భూ పాలపల్లిలో జరిగిన 'సింగరేణి భరోసా యాత్ర' బహిరంగ సభలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిష్టాత్మక సింగరేణి కాలరీస్ సంస్థ నష్టాల బాట పట్టడానికి గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని  తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఉద్ఘాటించారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనపై నిప్పులు చెరిగారు. "రాష్ట్రంలోని సింగరేణిని బీఆర్‌ఎస్ నాయకులు పదేళ్ల పాటు తమ సొంత ఆస్తిలా భావించి, కార్మికుల శ్రమను దారుణంగా దోచుకున్నారు. ఆ పార్టీ నేతల స్వార్థపూరిత నిర్ణయాల వల్లే నేడు సంస్థ కష్టాల్లోకి నెట్టబడింది" అని ఆయన ఆరోపించారు. సింగరేణి కార్మికుల కష్టాన్ని గుర్తించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని మంత్రి విమర్శించారు. కార్మికులకు సంస్థ చెల్లించాల్సిన రూ. 54 వేల కోట్ల బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. తన ప్రాణాలను పణంగా పెట్టి, బొగ్గు వెలికితీసే కార్మికుల కష్టానికి తగిన గుర్తింపు, సరైన వేతనాలు అందాలని ఆయన ఆకాంక్షించారు. సింగరేణి కేవలం ఒక సంస్థ మాత్రమే కాదని, అది ...