బీహార్ ఉపఎన్నిక : జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ అద్భుత విజయం
బీ హార్ ఉపఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీయే కూటమికి భారీ షాక్ తగిలింది. పాట్నాలోని ప్రతిష్ఠాత్మక బంకీపూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ అద్భుత విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 18,953 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొంది సంచలనం సృష్టించారు. మొత్తం 31 రౌండ్ల పాటు జరిగిన ఓట్ల లెక్కింపులో కిషోర్కు 63,203 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి నీరజ్కు 44,250 ఓట్లు పోలయ్యాయి. ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారి కేవలం 14,085 ఓట్లతో మూడో స్థానానికే పరిమితమయ్యారు. ఈ గెలుపుతో బీహార్ అసెంబ్లీలో జన్ సూరజ్ పార్టీ అధికారికంగా ఖాతా తెరిచింది. పార్టీ నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టనున్న మొట్టమొదటి నాయకుడిగా ప్రశాంత్ కిషోర్ చరిత్ర సృష్టించారు.