Posts

Showing posts with the label 29 bodies have been recovered from the debris

బొగ్గు గనిలో భారీ పేలుడు : 32 మంది సజీవ సమాధి

Image
పా కిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌, క్వెట్టా సమీపంలోని సోరేంజ్ ప్రాంతంలో ఉన్న బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 32 మంది గని కార్మికులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 29 మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీశారు. మరో మూడు మృతదేహాలను గుర్తించి బయటకు తీసేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. గని లోపల మీథేన్ వాయువు అధికంగా పేరుకుపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని అధికారుల ప్రాథమిక అంచనా వేస్తున్నారు. పేలుడు తీవ్రతకు ఒకదానికొకటి సమీపంలో ఉన్న రెండు గనులు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో గనిలో మొత్తం 36 మంది కార్మికులు పని చేస్తున్నట్లు సమాచారం. పేలుడు జరిగిన వెంటనే విపత్తు నిర్వహణ బృందాలు, గనుల శాఖ అధికారులు, స్థానిక సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ప్రమాదం జరిగిన 12 గంటలు దాటిన తర్వాత కూడా శిథిలాల కింద చిక్కుకున్నవారిని ప్రాణాలతో రక్షించే అవకాశాలు చాలా స్వల్పంగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రాంతంలో బొగ్గు గనుల్లో ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. అనేక గనుల్ల...