ఘాట్ రోడ్డులో అదుపుతప్పి కొండను ఢీకొన్న లారీ : డ్రైవర్ మృతి
ఆం ధ్రప్రదేశ్ లోని చిట్వేలి-రాపూరు ఘాట్ రోడ్డులో నిమ్మకాయల లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి కొండను ఢీకొట్టడంతో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. గూడూరు నుంచి వేంపల్లికి వెళుతుండగా ఘటన జరిగింది.. ప్రమాద సమయం లో లారీ నుంచి దూకి ప్రాణాలతో బయటపడిన యజమాని ప్రణాపాయం నుంచి తప్పించుకున్నాడు. సమాచారం అందుకున్న చిట్వేలి ఎస్సై వెంగయ్య ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.