Posts

సంజీవని కార్యక్రమంపైన కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రశంసలు : జాతీయ స్థాయిలో అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తాం

Image
వి జయవాడలో వైద్యారోగ్య శాఖకు చెందిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొన్న కేంద్రమంత్రి  జేపీ నడ్డా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సంజీవని కార్యక్రమంపైన ప్రశంసలు కురిపించారు. దీన్ని జాతీయ స్థాయిలో అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ప్రజలకు ముందస్తుగా వ్యాధులను గుర్తించడం, నివారణ, మెరుగైన చికిత్సతో పాటు అందుబాటు ధరల్లో వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు కేంద్రం నుంచి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. అమరావతిలోఏర్పాటు చేస్తున్న క్వాంటం బయో వ్యాలీకి జాతీయ స్థాయిలో గుర్తింపు కల్పించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సానుకూలంగా స్పందించారు. క్వాంటం బయో వ్యాలీ ఏర్పాటుకు కేంద్రం నుంచి సహకారం అందిస్తామని ప్రకటించారు. ఈ అంశంపై చర్చించేందుకు కేంద్రం నుంచి సాంకేతిక బృందాన్ని అమరావతికి పంపుతామన్నారు. క్వాంటం బయో వ్యాలీ ఏర్పాటు విషయంలో చంద్రబాబు ఆలోచన బాగుందని, ఆయన చేసిన వివిధ సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.

జానపద కళాకారుల సేవలను వినియోగించుకునే యోచనలో తెలంగాణ ప్రభుత్వం

Image
తె లంగాణ జానపద కళాకారుల సేవల వినియోగించుకునే యోచనలో ఉన్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కళాకారుల నైపుణ్యాలు పెంపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పర్యాటక కేంద్రాల్లో వేదికలు ఏర్పాటు చేసి కళాకారులకు ఉపాధి కల్పిస్తామన్నారు. ఇవాళ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకలకు బదులిచ్చిన మంత్రి.. పర్యాటకులకు వినోదం కల్పించేందుకు కళారూపాల ప్రదర్శన ఏర్పాటు చేస్తామన్నారు. సాంస్కృతిక శాఖ ద్వారా సీఎం చేతుల మీదుగా ప్రభాత భేరీ కార్యక్రమం చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. 8500 మంది కళాకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చామని కళాకారులకు రూ.3500 చొప్పున పింఛన్ ఇస్తున్నామన్నారు. గద్దర్ ఫౌండేషన్ కింద రూ. 3 కోట్లు కేటాయించామని వృద్ధ కళాకారులకు ప్రతి నెల పింఛన్లు ఇస్తున్నామన్నారు. పద్మశ్రీ గ్రహితలకు రూ. 25 లక్షల చొప్పున ఇచ్చామన్నారు. గంజాయి, మద్యం పారద్రోలేందుకు కళాకారుల ద్వారా ప్రదర్శనలు ఇప్పించి సమాజంలో అసమానతలపై చైతన్యపరుస్తామన్నారు.

బీజేపీ నేత మేనల్లుడి ప్రాణం తీసిన అక్రమ సంబంధం

Image
హ ర్యానాలోని రేవారిలో బీజేపీ నేత మేనల్లుడికి తన భార్యతో అక్రమ సంబంధం ఉన్నట్లు అతడి స్నేహితుడు అనుమానించాడు. ఈ నేపథ్యంలో బంధువైన మరో వ్యక్తితో కలిసి అతడ్ని కొట్టి చంపాడు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. సెప్టెంబర్ 7న హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీ సమీపంలోని నిర్మానుష్య రహదారిలో రక్తం మడుగులో పడి ఉన్న బీజేపీ నేత మేనల్లుడైన 40 ఏళ్ల జితేంద్ర మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఐరన్‌ రాడ్‌తో అతడ్ని కొట్టి హత్య చేసినట్లు తలపై గాయాల ద్వారా తెలుసుకున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. జితేంద్ర కుటుంబ సభ్యుల అనుమానం, ఇతర ఆధారాల సహాయంతో స్నేహితుడైన ప్రవీణ్ అలియాస్ పాప్లా, అతడి మేనల్లుడు అమన్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. జితేంద్ర హత్య గురించి నిందితులను ప్రశ్నించారు. కాగా, స్నేహితుడైన జితేంద్రకు తన భార్యతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో హత్య చేసినట్లు ప్రవీణ్‌ చెప్పాడని పోలీస్‌ అధికారి తెలిపారు. సెప్టెంబర్ 7న బీర్ పార్టీ పేరుతో అతడ్ని పిలిచి అమన్‌తో కలిసి ఒక వాహనంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడని చెప్పారు. జితేంద్ర వాహనం దిగగానే, ప్రవీణ్ ఇనుప రాడ్...

21 కిలోల ఎండు గంజాయి స్వాధీనం : నలుగురు అరెస్ట్‌, రూ. 25వేల నగదును స్వాధీనం

Image
హై దరాబాద్‌ నగరంలో ఎండు గంజాయిని విక్రయిస్తున్న నలుగురు సభ్యులు గల ముఠాను హబీబ్‌ నగర్‌ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 21 కిలోల గంజాయిని, రూ. 25వేల నగదును స్వాధీనం చేసుకున్నామని ఆసిఫ్‌నగర్‌ డివిజన్‌ అసిస్టెంట్‌ పోలీస్‌ కమిషనర్‌ కె శ్రీనివాస్‌ వెల్లడించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశామని వివరించారు. మహారాష్ట్రకు చెందిన సందీప్‌ నంద కిషోర్‌, రాహుల్‌ రాజేశ్‌ పాటిల్‌ అనే ఇద్దరు యువకులు మహారాష్ట్రలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్‌లోని మంగల్‌బస్తీకి చెందిన కాంబ్లె ఉమేశ్‌, కాంబ్లె సూరజ్‌కు అధిక ధరకు విక్రయిస్తున్నారని తెలిపారు. అందిన పక్కా సమాచారం మేరకు హబీబ్‌నగర్‌లో నిఘా పెట్టి గంజాయిని విక్రయిస్తుండగా నలుగురిని పట్టుకున్నామని పేర్కొన్నారు. వీరిపై ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, అయితే దర్యాప్తులో నిందితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. గంజాయి ముఠాను పట్టుకోవడంలో కృషి చేసిన పోలీసు అధికారులను, సిబ్బందిని అభినందించారు.

1980ల రెట్రో ఫొటో ఎడిటింగ్ ట్రెండ్‌ను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం

Image
1980ల రెట్రో ఫొటో ఎడిటింగ్ ట్రెండ్‌ను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో  డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సాధారణ ఫొటోలను 1980ల నాటి రెట్రో ఫొటోలుగా మార్చుతామంటూ సోషల్ మీడియా ప్రకటనలు, సందేశాల ద్వారా సైబర్ నేరగాళ్లు ప్రజలను ఆకర్షిస్తున్నారని శిఖా గోయల్ తెలిపారు. ఉచితంగా లేదా అపరిమితంగా ఎడిటింగ్ సదుపాయం కల్పిస్తామంటూ నమ్మబలుకుతున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సైబర్ కేటుగాళ్లు పంపే అనుమానాస్పద లింకులపై క్లిక్ చేస్తే ప్రమాదం తప్పదని ఆమె హెచ్చరించారు. అలాంటి లింకులను ఓపెన్ చేస్తే ఏపీకే ఫైళ్ల ద్వారా నిందితులు మోసాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా ఎస్ఎంఎస్, ఓటీపీ, కాంటాక్టులు, బ్యాంకింగ్, ఆర్థిక, వ్యక్తిగత సమాచారం సహా మొబైల్‌లో భద్రపరిచిన ఇతర సున్నితమైన సమాచారాన్ని నిందితులు దొంగిలించే అవకాశం ఉందన్నారు. దీని ద్వారా ఆర్థిక మోసాలు, అనధికారిక లావాదేవీలు, గుర్తింపు దుర్వినియోగం వంటి సైబర్ నేరాలకు పాల్పడే అవకాశం ఉందని శిఖా గోయల్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎస్ఎంఎస...

బ్రిక్స్ సమావేశాలు : ఇరాన్-యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నేతల కీలక భేటీ

Image
న్యూ ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) క్రౌన్ ప్రిన్స్ షేక్‌ ఖాలెద్‌ బిన్‌ మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇద్దరు దేశాధినేతల మధ్య చర్చల్ని కీలక పరిణామంగా చెబుతున్నారు. శనివారం ఇద్దరు నేతలు చర్చలు జరిపారు. ఈ విషయాన్ని ఇరాన్ రాయబార కార్యాలయం వెల్లడించింది. అమెరికా, ఇజ్రాయిల్‌లు కలిసి ఇరాన్‌పై దాడి చేసిన తర్వాత, గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరాన్ యూఏఈలోని దుబాయ్, అబుదాబితో పాటు పలు కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఇరాన్, యూఏఈ మధ్య సంబంధాల్లో ఉద్రిక్తత నెలకొన్న తరుణంలో ఈ చర్చలు పరిష్కారానికి మార్గాన్ని సుగమం చేస్తాయని భావిస్తున్నారు. గతంలో ఇరాన్ తమపై చేస్తున్న దాడుల్ని యూఏఈ తీవ్రంగా ఖండించింది. తమ సార్వభౌమాత్వాన్ని ఉల్లంఘించే చర్చల్ని సహించేది లేదని, అవసరమై ప్రతిస్పందిస్తామని హెచ్చరించింది. మరోవైపు, అమెరికాకు ఆశ్రయం ఇచ్చే దేశాలను లక్ష్యంగా చేసుకుంటామని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే యూఏఈ...

రైల్వే ఉన్నతాధికారి ఫొటోల అసభ్యకరంగా మార్ఫింగ్ : ₹15 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడిన మహిళ

Image
ఉ త్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ ఓ రైల్వే ఉన్నతాధికారి ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి, ఆయన నుంచి ₹15 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడిన మెరీనా లాజరస్ అనే మహిళ వ్యవహారం బట్టబయలై తీవ్ర కలకలం రేపింది. ఆధునిక పరిజ్ఞానాన్ని అడ్డదారుల్లో వాడుకుంటూ, ఓ ఉన్నతాధికారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేందుకు యత్నించిన ఈ ఉదంతం తీవ్ర చర్చనీయాంశమైంది. బాధితుడైన రైల్వే అధికారికి ఆ మహిళ డీప్‌ఫేక్/మార్ఫింగ్ అశ్లీల చిత్రాలను పంపించి, వెంటనే ₹15 లక్షలు ఇవ్వకపోతే ఆ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు, పనిచేసే ఆఫీస్‌కు పంపుతానని తీవ్రస్థాయిలో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడింది. తీవ్ర మానసిక వేదనకు గురైన సదరు అధికారి బెదిరింపులకు ఏమాత్రం తలొగ్గకుండా వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సైబర్ పోలీసులు పక్కా సమాచారంతో మెరీనా లాజరస్ ఆచూకీని కనిపెట్టి, ఆమెను అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు మెరీనా లాజరస్‌పై కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. "సైబర్ బెదిరింపులకు ఎవరూ లొంగిపోవద్దని, ఇలాంటి ఘట...