Posts

17 మంది టీఎంసీ రెబల్ ఎంపీలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు : కూచ్ బీహార్ ఎంపీ జగదీశ్ చంద్ర బాసునియా

Image
టీ ఎంసీ నుంచి బయటకు వచ్చిన 17 మంది రెబల్ ఎంపీలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కూచ్ బీహార్ ఎంపీ జగదీశ్ చంద్ర బాసునియా అన్నారు. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీపై తిగుబాటు బావుటా ఎగురవేసిన 20 మంది ఎంపీలు నేషనలిస్టు పార్టీలో చేరిన విషయం తెలిసిందే. వీరిలో 17 మంది బీజేపీలోకి మారేందుకు సిద్ధంగా ఉన్నారని ఎంపీ జగదీశ్ అన్నారు. 'మాలో 17 మంది ఎంపీలో బీజేపీలో చేరనున్నారు. మొత్తం ఎంపీల్లో ఈ సంఖ్య మూడింట రెండువంతులు కాబట్టి మాకు యాంటీ డిఫెక్షన్ లా వర్తించదు' అని చెప్పారు. ఈ పరిణామాలకు బీజేపీ దూరంగా జరిగే ప్రయత్నం చేసింది. పశ్చిమబెంగాల్ బీజేపీ చీఫ్ సమిక్ భట్టాచార్య మాట్లాడుతూ కేవలం పార్టీలో చేరతామంటూ వచ్చిన ప్రతి ఒక్కరినీ తాము చేర్చుకోమనిచెప్పారు. ఎంపీ జగదీశ్ కామెంట్స్‌పై మరో రెబల్ ఎంపీ శతాబ్దీ రాయ్ కూడా ఆచితూచి స్పందించారు. అవి జగదీశ్ వ్యక్తిగత వ్యాఖ్యలని అన్నారు. ఈ విషయంలో తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. మరో ఎంపీ అబూతాహిర్ ఖాన్ మాత్రం ఘాటుగా స్పందించారు. తమ తరఫున మాట్లాడే హక్కు ఆయనకు లేదని తేల్చి చెప్పారు. మైనారిటీ వర్గానికి చెందిన ఎంపీలు బయటనుంచే బీజేపీకి మద్దతు ఇస్తారన్...

నవ వధువును ఢీకొట్టి 10 అడుగుల దూరం ఈడ్చుకెళ్లిన బైక్ : సీసీటీవీలో దృశ్యాలు రికార్డు

Image
గు జరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో కొత్తగా పెళ్లయిన ఓ యువతి స్కూటర్‌పై వెళ్తుండగా అతివేగంగా దూసుకొచ్చిన బైక్ బలంగా ఢీకొట్టింది. అంతేకాకుండా ఆమెను రోడ్డుపై దాదాపు 10 అడుగుల దూరం ఈడ్చుకెళ్లింది. వివాహమైన కొద్ది రోజులకే, చేతులకు పెట్టుకున్న మెహందీ రంగు కూడా చెరిగిపోకముందే ఆ యువతి ప్రాణాలు కోల్పోవడం ఆమె కుటుంబాన్ని, స్థానికులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె యథావిధిగా రోడ్డుపై స్కూటర్‌పై ప్రయాణిస్తుండగా, మితిమీరిన వేగంతో వచ్చిన బైక్ నియంత్రణ కోల్పోయి స్కూటర్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ ధాటికి కిందపడిపోయిన యువతిని బైక్ సుమారు 10 అడుగుల దూరం రోడ్డుపై దారుణంగా లాక్కెళ్లింది. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న ఆమెను స్థానికులు వెంటనే రక్షించి ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స ఫలించక ఆమె ప్రాణాలు విడిచింది.

డ్రైవర్‌ను ప్రత్యేకంగా పలకరించి, కరచాలనం చేసి వెళ్లిన అబుదాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్

Image
అ బుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ చేసిన ఓ చిన్న పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనను సురక్షితంగా తీసుకువచ్చిన డ్రైవర్‌ను ప్రత్యేకంగా పలకరించి, కరచాలనం చేసి వెళ్లిన ఆయన తీరు నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. 18వ బ్రిక్స్ సదస్సు కోసం న్యూఢిల్లీకి వచ్చిన షేక్ ఖలీద్, సదస్సు ముగిసిన అనంతరం విమాన ప్రయాణానికి బయలుదేరే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కారు నుంచి దిగిన ఆయన అక్కడ ఉన్న ప్రముఖులకు అభివాదం చేశారు. అనంతరం ముందుకు వెళ్తున్న సమయంలో తన డ్రైవర్‌ను పలకరించలేదని గుర్తించినట్లుగా కనిపించింది. వెంటనే ఆయన వెనక్కి తిరిగి కారు వద్దకు వెళ్లి డ్రైవర్‌తో కరచాలనం చేసి, కొద్దిసేపు మాట్లాడారు. ఆ తర్వాతే అక్కడి నుంచి బయలుదేరారు. అతను భారతదేశానికి చెందిన డ్రైవర్ కావడం విశేషం. కేవలం కొన్ని క్షణాల పాటు జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు తమ చుట్టూ ఉండే సిబ్బందిని పలకరించడం అరుదుగా కనిపిస్తుంటుంది. అయితే యువరాజు షేక్ ఖలీద్ స్వయంగా వెనక్కి తిరిగి డ్రైవర్‌ను పలకరించడంతో ఆయన వినయాన్ని పలువురు న...

దక్షిణాఫ్రికాలో రెండు మినీ బస్ టాక్సీలు ఢీ కొని 21 మంది మృతి, నలుగురికి తీవ్ర గాయాలు

Image
ద క్షిణాఫ్రికాలోని వెస్ట్రన్ కేప్ ప్రావిన్స్ లో రెండు మినీ బస్ టాక్సీలు ఒకదాన్నొకటి ఢీ కొన్న ఘటనలో 21 మంది మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం వెస్ట్రన్ కేప్ ప్రావిన్స్ లోని ఎన్ 1 హైవేపై జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘోర ప్రమాదం ఆదివారం అర్ధరాత్రి 11 గంటల 30 నిమిషాల సమయంలో జరిగింది. ఈస్ట్ కేప్ టౌన్ నుంచి దాదాపు 380 కి. మీ. దూరంలో ఈ ఘటన జరిగినట్లు ది రోడ్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ కార్పొరేషన్ తెలిపింది. వెస్ట్రన్ కేప్ మొబిలిటీ డిపార్ట్ మెంట్ తెలిపిన వివరాల ప్రకారం ముందుగా ఓ ఎస్ యూవీ వాహనం క్రాష్ కాగా అదే సమయంలో ఎదురెదురుగా వస్తున్న రెండు మినీ బస్సులు ఒకదాన్నొకటి ఢీ కొన్నాయి. ముగ్గురు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా అప్పటికే వాళ్లు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. భారీ రోడ్డు ప్రమాదం నేపథ్యంలో ఎన్ 1 హైవే ను పూర్తిగా మూసివేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అక్కడ ఎమర్జెన్సీ బృందాలు పనిచేస్తున్నాయని అన్నారు. ఇక రోడ్ ట్రాఫిక్ మే...

నైరుతి రుతుపవనాల తిరోగమనం : ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు : ఐఎండీ అంచనా

Image
నా లుగైదు రోజుల్లో రాజస్థాన్ ప్రాంతం నుంచి నైరుతి రుతుపవనాలు ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇటీవలి అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలే ఈ సీజన్లో అత్యధిక వర్షపాతంగా నిలిచాయి. మరో రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీలోని శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు విస్తారంగా వర్షాలు కురిపించింది. మలికిపురంలో గరిష్టంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతంతో పోలిస్తే గణనీయమైన లోటు కనిపిస్తోంది. ఈ నెల 19 నాటికి పశ్చిమ రాజస్థాన్‌ నుంచి రుతుపవనాల ఉపసంహరణ ప్రారంభం కానుందని ఐఎంజీ ప్రకటించింది. ప్రస్తుతం సముద్ర మట్టానికి దగ్గరగా ఉన్న రుతుపవన ద్రోణి, వాయువ్య బంగాళాఖాతంపై ఉన్న ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. అంచనాల కంటే ఆలస్యంగా జూన్ 4న కేరళలోకి ప్రవే...

చైనా మార్కెట్లో షియోమీ ప్యాడ్ 9, షియోమీ ప్యాడ్ 9 ప్రో విడుదల

Image
చైనా మార్కెట్లో షియోమీ కంపెనీ షియోమీ ప్యాడ్ 9, షియోమీ ప్యాడ్ 9 ప్రో మోడళ్లను కొత్త టాబ్లెట్లను విడుదల చేసింది.  ఈ రెండు టాబ్లెట్లు 3.2K రిజల్యూషన్ డిస్‌ప్లే, 144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 1,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి ప్రీమియం ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి. ఇక ప్రాసెసింగ్ కోసం రెండు మోడళ్లలోనూ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌లను అందించారు. HyperOS 4 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఇవి పనిచేస్తాయి. షియోమీ ప్యాడ్ 9 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 2,999 (సుమారు రూ.42,800)గా నిర్ణయించారు. 8GB + 256GB మోడల్ ధర CNY 3,299 (సుమారు రూ.47,000), 12GB + 256GB వేరియంట్ ధర CNY 3,799 (సుమారు రూ.54,000). 8GB + 256GB స్టోరేజ్‌తో వచ్చే Soft-Light Edition ధర CNY 3,499 (సుమారు రూ.49,900). ఈ టాబ్లెట్ సిల్వర్, క్లౌడ్ సీడార్ గ్రీన్, బ్లాక్, ఐస్ పీచ్ పింక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. షియోమీ ప్యాడ్ 9ప్రో 8GB + 128GB బేస్ వేరియంట్ ధర CNY 3,799 (సుమారు రూ.54,000). 8GB + 256GB మోడల్ ధర CNY 4,099 (సుమారు రూ.58,500), 12GB + 256GB ధర CNY 4,599 (సుమారు రూ.65,600), 16GB + 256GB వేరియంట్ ధర CNY 4,999 (సుమారు రూ.71,300)గా ...

కడపలో వడ్ల గింజలతో రూపొందించిన వినాయక విగ్రహం

Image
ఆం ధ్రప్రదేశ్ లోని కడపలో వడ్ల గింజలతో గణపతి విగ్రహాన్ని రూపొందించి ప్రతిష్టించారు. కాలుష్యానికి ఏమాత్రం హాని కలగకుండా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని తయారు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.ప్రతి ఏడాది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రసాయనాలతో కూడిన రంగులతో తయారయ్యే విగ్రహాలకు భిన్నంగా తమ బృందం సభ్యులే స్వయంగా పర్యావరణహితంగా గణపతిని రూపొందిస్తున్నట్లు చెప్పారు.పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే తమ ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.