Posts

అదనపు కట్నం వివాదంలో భార్య ముక్కు కొరికేసిన భర్త

Image
తె లంగాణలోని మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో భార్యాభర్తల మధ్య జరిగిన వివాదం తీవ్రరూపం దాల్చడంతో, కోపోద్రిక్తుడైన భర్త విచక్షణ కోల్పోయి భార్య ముక్కును గట్టిగా కొరికేశాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కోటపల్లి మండల కేంద్రానికి చెందిన మమతకు, అదే మండలం మల్లంపేటకు చెందిన ఎనగందుల మణిచందర్‌తో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్నాళ్లు సజావుగానే సాగిన వీరి సంసారంలో అదనపు కట్నం చిచ్చు రేపింది. గత నాలుగేళ్లుగా మణిచందర్ అదనపు కట్నం కోసం భార్యను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. దీనికి తోడు మద్యానికి బానిసకావడంతో ఇంట్లో తరచూ గొడవలు నిత్యకృత్యంగా మారాయి. మణిచందర్ వేధింపులు తాళలేక, విసిగిపోయిన మమత పది రోజుల క్రితం తన పిల్లలతో సహా కోటపల్లిలోని తల్లిదండ్రుల ఇంటికి వచ్చేసింది. మణిచందర్ తన కుటుంబ సభ్యులతో కలిసి అత్తగారింటికి వెళ్లి మళ్లీ గొడవకు దిగాడు. ఈ క్రమంలో మమత తండ్రి నారాయణపై దాడికి ప్రయత్నించగా, తండ్రిని కాపాడుకునేందుకు మమత అడ్డుగా వెళ్లింది. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మణిచందర్ఆ మె ముక్కును బలంగా కొరికేసాడు. భర్త రాక్షసత్వంతో ముక్కు తెగి...

నేపాల్‌లో వరుసగా రెండుసార్లు భూకంపం : రిక్టర్‌ స్కేలుపై 4.5, 4.2 తీవ్రతతో నమోదు

Image
నే పాల్‌లో బుధవారం తెల్లవారుజామున వరుసగా రెండుసార్లు భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం లేదు. మూడు గంటల వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. తొలి భూకంపం రిక్టర్‌ స్కేలుపై 4.5 తీవ్రతతో, రెండోది 4.2 తీవ్రతతో నమోదైంది. నేషనల్‌ సిస్మోలాజికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1:51 గంటలకు తొలి భూకంపం నమోదైంది. దీని తీవ్రత 4.5గా నమోదైనట్లు వెల్లడించింది. అనంతరం మూడు గంటల్లోపే మరోసారి భూమి కంపించింది. ఉదయం 4:28 గంటలకు 4.2 తీవ్రతతో రెండో భూకంపం సంభవించింది. దీని కేంద్రం కూడా ముగు జిల్లాలోని కలీయీ ప్రాంతం పరిసరాల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రకంపనలు పొరుగున ఉన్న డోల్పా, జుమ్లా జిల్లాలనూ తాకాయి.

ఉచిత సినిమా కోసం 'గూగుల్‌ పేటీవీ' అనే ఫైల్‌ను డౌన్‌లోడ్‌ : బ్యాంకు ఖాతా నుంచి రూ. 29 వేలు మాయం

Image
హై దరాబాద్ లోని బోరబండ ప్రాంతానికి చెందిన షేక్‌ మహ్మద్‌ ఈ నెల 11న ఇన్‌స్ట్రాగామ్‌ స్క్రోల్‌ చేస్తుండగా ఉచితంగా సినిమాల అందిస్తామన్న ప్రకటన చూశాడు. 'గూగుల్‌ పేటీవీ' అనే ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేశాడు. కొద్ది గంటల్లోనే తన ఐడీబీఐ బ్యాంకు ఖాతా నుంచి రూ. 29 వేలు బదిలీ అయ్యాయి. దీంతో బా«ధితుడు ఈనెల 13న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఫార్ములావన్‌ రేసు పునరుద్ధరణకు చర్యలు : పది మంది సభ్యులతో కూడిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర క్రీడా మంత్రి

Image
దే శంలో ప్రపంచ ప్రసిద్ధ ఫార్ములావన్‌ కారు రేసింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ రేసు పునరుద్ధరణకు ఉన్న అవకాశాలు, ఎదురయ్యే సవాళ్లు, సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు పది మంది సభ్యులతో కూడిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర క్రీడా మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ మంగళవారం వెల్లడించారు. ఈ టాస్క్‌ఫోర్స్‌కు నీతి ఆయోగ్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ యుగల్‌ కిషోర్‌ జోషి అధ్యక్షత వహించనున్నారు. ఇందులో క్రీడా శాఖ సంయుక్త కార్యదర్శి కునాల్‌తో పాటు భారత మోటార్‌ స్పోర్ట్స్‌ సంఘం అధ్యక్షుడు అరిందమ్‌ ఘోష్‌ కూడా ఉన్నారు. అలాగే సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌, పరోక్ష పన్నుల బోర్డు అధికారులకు కూడా ఈ టాస్క్‌ఫోర్స్‌లో చోటు దక్కింది. 'దేశంలో మోటార్‌ స్పోర్ట్స్‌ పునరుద్ధరణలో ఎదురయ్యే సవాళ్లను ఇది క్షుణ్ణంగా అంచనా వేస్తుంది. దానికి అనుగుణంగా విధానపరమైన చర్యలు గుర్తిస్తుంది. పన్ను సంబంధిత సమస్యలతో పాటు పబ్లిక్‌-ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ నమూనాల అవకాశాలను కూడి పరిశీలిస్తాము. 2028 నాటికి దేశంలో ఫార్ములావన్‌ రేసును మళ్లీ నిర్వహించడమే మా లక్ష్యం'అని మా...

చోరీకి వెళ్లి ఇనుప గ్రిల్స్‌లో ఇరుక్కుపోయిన దొంగ : వీడియో సోషల్ మీడియాలో వైరల్

Image
గు జరాత్‌లోని సూరత్‌లో చాలాకాలంగా తాళం వేసి ఉన్న ఎన్‌ఆర్‌ఐ ఇంట్లో చోరీకి వెళ్లిన ఓ దొంగకు ఊహించని పరిస్థితి ఎదురైంది. రాత్రి సమయంలో ఇంటికి ఉన్న ఇనుప గ్రిల్స్‌ దూరి లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా, అందులో అతడు ఇరుక్కుపోయాడు. ఎంత ప్రయత్నించినా బయటపడలేక రాత్రంతా అక్కడే నానా తంటాలు పడ్డాడు. సూరత్‌లోని రాజారాం నగర్‌ సొసైటీకి చెందిన కిశోర్‌భాయ్‌ అమెరికాలో నివసిస్తున్నారు. ఆయనకు చెందిన భవనం చాలాకాలంగా ఖాళీగానే ఉంటోంది. ఖాళీగా ఉన్న ఆ ఇంట్లో దొంగతనం చేసేందుకు వచ్చిన దుండగుడు, కిటికీ ఇనుప గ్రిల్స్‌ మధ్యలో ఇరుక్కుపోయి బయటకు రాలేకపోయాడు. తెల్లారాక గ్రిల్స్‌లో వేలాడుతున్న దొంగను గమనించిన స్థానికులు ఆగ్రహంతో కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కపోద్రా పోలీసులు రంగంలోకి దిగారు. అమెరికాలో ఉన్న ఇంటి యజమాని కిశోర్‌భాయ్‌తో మాట్లాడగా, ఆ ఇంట్లో అసలు నగదు లేదా విలువైన వస్తువులు ఏమీ లేవని స్పష్టం చేసినట్లు ఇన్‌స్పెక్టరు ఎం.ఆర్‌.సోలంకి తెలిపారు.

రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.32 : ప్రతీ కుటుంబానికి వారానికి రెండు కిలోల చొప్పున రాయితీ ఉల్లిని అందించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

Image
ఆం ధ్రప్రదేశ్ లో  రైతు బజార్ల ద్వారా రాయితీపై ఉల్లిపాయలను విక్రయించడానికి పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలోని రైతు బజార్లలో రూ. 32 కే కిలో ఉల్లిపాయలను అందించేందుకు అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు. అక్రమాలను, అక్రమ నిల్వలను అడ్డుకునేందుకు ఒక పక్కా ప్రణాళికను రూపొందించారు. రేషన్ బియ్యం పంపిణీ కోసం వాడుతున్న 'రైస్' యాప్‌లోనే ప్రతి కుటుంబం తీసుకునే ఉల్లి వివరాలను నమోదు చేయనున్నారు. ప్రతీ కుటుంబానికి వారానికి రెండు కిలోల చొప్పున ఈ రాయితీ ఉల్లిని అందించనున్నారు. రాబోయే రెండు రోజుల్లో ఈ పంపిణీ ప్రక్రియ అందుబాటులోకి రానుంది. వారం రోజుల కిందట రూ. 50గా ఉన్న ఉల్లి ధర, ఒక్కసారిగా రూ. 80 మార్కును దాటేసింది. రెండు నెలల కిందట కేవలం రూ. 20 పలికిన కిలో ఉల్లి ధర ఇప్పుడు మూడింతలు కావడం గమనార్హం. వర్షాభావ పరిస్థితుల వల్ల మహారాష్ట్ర, కర్ణాటక, కర్నూలు ప్రాంతాల్లో దిగుబడి గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం కేవలం మహారాష్ట్ర నుంచి మాత్రమే అరకొరగా సరుకు వస్తుండటంతో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక ధరలు మండిపోతున్నాయి. రానున్న రోజుల్లో కిలో ఉల్లి రూ. 100కు చేరినా ఆశ్చర్యం లేదని వ్యాపారులు...

రైలు కిందపడి తీవ్ర గాయాలపాలైన ప్రయాణికుడిని రక్షించిన హెడ్ కానిస్టేబుల్

Image
ఆం ధ్రప్రదేశ్ లోని తుని రైల్వే స్టేషన్‌లో రైలు కిందపడి తీవ్ర గాయాలపాలైన ఓ ప్రయాణికుడి ప్రాణాలను అనకాపల్లి జిల్లా యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ చంద్రరావు ప్రాణాలకు తెగించి కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు. విశాఖపట్నం నుండి అలెప్పీ వెళ్తున్న ధన్‌బాద్ ఎక్స్‌ప్రెస్ తుని రైల్వే స్టేషన్ సమీపంలో నెమ్మదిగా కదులుతున్న సమయంలో, ఓ గుర్తుతెలియని ప్రయాణికుడు రైలు ఎక్కేందుకు ప్రయత్నించి అదుపుతప్పి బోగీ కింద పట్టాలపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో ఆ ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడ ఉన్న పలువురు భయంతో వీడియోలు తీస్తూ ఉండిపోగా, అదే రైలులో ప్రయాణిస్తున్న హెడ్ కానిస్టేబుల్ చంద్రరావు క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించారు. రైలు ఆగిన వెంటనే కిందకు దిగి, ఏమాత్రం సంకోచించకుండా బోగీ కిందకు పాకుతూ వెళ్లి తీవ్ర గాయాలతో పట్టాల మధ్య చిక్కుకున్న ప్రయాణికుడిని ఒడుపుగా బయటకు లాగి రక్షించారు. అనంతరం బాధితుడిని చికిత్స నిమిత్తం అత్యవసరంగా సమీప ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. ​సమయస్ఫూర్తితో వ్యవహరించి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రయాణికుడిని రక్షించిన హెడ్ కానిస్టేబుల్ చంద్రరావు సాహసానికి ...