Posts

ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భారత్‌కు వెళ్లాల్సిన 92 మంది సిక్కు యాత్రికులను అడ్డుకున్న పాకిస్తాన్ ప్రభుత్వం

Image
భా రత్‌లో జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు  ప్రయాణం అవ్వాల్సిన సుమారు 92 మంది సిక్కు యాత్రికుల బృందాన్ని పాకిస్థాన్ అధికారులు ఫైసలాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడ్డుకున్నారు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లేదనే సాకును చూపుతూ వారి ప్రయాణాన్ని నిలిపివేసారు. దీంతో విమానాశ్రయంలోనే చిక్కుకుపోయిన సిక్కు యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ పాకిస్థాన్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షార్జా మీదుగా ఢిల్లీ చేరుకుని, అక్కడి నుంచి వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఈ యాత్రికుల ప్రధాన ప్రణాళిక. శ్రీ హర్మందిర్ సాహిబ్‌లో జరిగే శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ జీ ప్రకాష్ పురబ్ వేడుకలతో పాటు హేమ్‌కుండ్ సాహిబ్ యాత్ర, ఢిల్లీలోని పలు చారిత్రక గురుద్వారాలను దర్శించుకోవడానికి వీరు ప్రయాణం కావాల్సి ఉంది. ఎయిర్‌పోర్టులోనే తమను నిలిపివేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన యాత్రికులు పాక్ ప్రభుత్వాన్ని నిలదీశారు. "మమ్మల్ని ఈ విధంగా వ్యవహరించడానికి మేమేమైనా తీవ్రవాదులమా?" అని ఆవేదనతో ప్రశ్నించారు. పాకిస్థానీ సిక్కు యాత్రికులకు ఎదురవుతున్న ఈ సవాళ్లకు సరిహద్దుల్లో తలెత్తిన తీవ్ర ఉద...

పదవ తరగతి బాలికపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు : ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని

Image
త మిళనాడులో పదవ తరగతి బాలికపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు కారణంగా విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని అధికారులు శుక్రవారం తెలిపారు. అరెస్టు చేయబడిన ఆ ఉపాధ్యాయుడిపై ‘అనుచిత ప్రవర్తన’ ఆరోపణలు కూడా ఉన్నాయి. జగదేసన్‌గా గుర్తించబడిన నిందితుడిని, పిల్లలపై లైంగిక నేరాల నుండి రక్షణ చట్టం (పోక్సో) కింద అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఉపాధ్యాయుడు బాలికను అనుచితంగా తాకినట్లు ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో వెల్లడైందని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. “ఉపాధ్యాయుడు ఆమెను అనుచితంగా, చెడుగా తాకాడు, ఇది మేము నిర్ధారించుకున్నాము” అని ఆ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. బాలిక మరణానికి దారితీసిన పరిస్థితులపై, అలాగే ఉపాధ్యాయుడిపై ఉన్న ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సెప్టెంబర్ 16న ఒప్పో కే-14 లైట్ విడుదల

Image
దే శీయ మార్కెట్లో సెప్టెంబర్ 16న ఒప్పో కే-సిరీస్ లో కే-14 లైట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. రోజువారీ వినియోగంతో పాటు ఎక్కువ కాలం మన్నిక కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను కంపెనీ తీసుకొస్తోంది. దీనిలో 7,000mAh బ్యాటరీ అందించనుంది. ఈ బ్యాటరీ సుమారు ఆరు సంవత్సరాల పాటు మన్నికగా పనిచేసేలా రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz అల్ట్రా బ్రైట్ డిస్‌ప్లే ఉంటుంది. అధిక రిఫ్రెష్ రేట్ కారణంగా స్క్రోలింగ్, యానిమేషన్లు, ఇతర రోజువారీ పనులు స్మూత్‌గా ఉండే అవకాశం ఉంది. అలాగే బయట ప్రకాశవంతమైన వాతావరణంలో స్క్రీన్‌ను సులభంగా చూడటానికి డిస్‌ప్లేను రూపొందించారు. ఈ ఫోన్‌కు IP64 రేటింగ్ లభించింది. దీంతో దుమ్ము, రోజువారీ వినియోగంలో ఎదురయ్యే నీటి చినుకులు, స్వల్ప స్ప్లాష్‌ల నుంచి రక్షణ లభించనుంది. సాఫ్ట్‌వేర్ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ కలర్‌ఓఎస్ 16తో నేరుగా అందుబాటులోకి రానుంది. మెరుగైన సిస్టమ్ పనితీరు, స్మూత్ ఆపరేషన్, కొత్త ఇంటర్‌ఫేస్ ఫీచర్లను ఇందులో అందించనున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్ ఫోన్ లో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులోకి రానుంది. ఫెదర్ పర్పుల్,...

శాసనసభాపతికి అవమానం, దళితులు ర్యాలీచేస్తే పసుపునీళ్ళతో శుద్ధి : బాధ్యులపై చర్య తీసుకోవాలని గవర్నర్ కు వినతిపత్రం అందజేసిన మంత్రులు

Image
తె లంగాణ  లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు వినతిపత్రం అందజేశారు. శాసనసభ లోపల, బయట దళితులు, మహిళల భద్రత, ఆత్మగౌరవాన్ని కాపాడాలని వారు కోరారు. బీఆర్ఎస్ పార్టీ నాజీ పార్టీలా ప్రవర్తిస్తుందని, తెలంగాణను అంటరానితనం ఉన్న చీకటి యుగంలోకి తీసుకెళ్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో కుల వివక్షను మళ్ళీ తెరమీదకి తెచ్చిందని అన్నారు. ఈ నెల 8న అసెంబ్లీ ఎదుట జరిగిన బీఆర్ఎస్ నేతల ఆందోళన, తదనంతర పరిణామాలను మంత్రులు గవర్నర్ శివ ప్రసాద్ శుక్లాకు వివరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని అవమానకర వ్యాఖ్యలు చేశారని, ఆయన తల్లిని ఉద్దేశించి అనుచిత పదాలు వాడి దళిత సమాజం, మహిళలను అవమానించారని ఆరోపించారు. అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు సహా నేతలు చొక్కాలు విప్పి పోలీసులపై విసిరారని, మహిళా పోలీసులపై అభ్యంతరకరంగా ప్రవర్తించారని, కేటీఆర్ నేతృత్వంలో భౌతిక దాడులు జరిగాయని పేర్కొన్నారు. దళితులు శాంతియుతంగా కేసీఆర్ క్షమాపణ కోరి ర్యాలీ చేస్తే, దానికి...

అందుబాటులోకి వచ్చిన వన్ UI 9 బీటా అప్‌డేట్‌

Image
దే శంలో ఈరోజు నుంచి వన్ UI 9 బీటా అప్‌డేట్‌ అందుబాటులోకి వచ్చింది. మొదటి బిల్డ్‌తో పాటు సెప్టెంబర్ 2026 సెక్యూరిటీ ప్యాచ్‌ను అందించారు. ఈ అప్‌డేట్ సైజు దాదాపు 2.1GB ఉంటుంది. శామ్‌సంగ్ మెంబర్స్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటే, ఓవర్ ది ఎయిర్ పద్ధతిలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కేవలం ఫ్లాగ్‌షిప్‌ మోడల్స్‌కే పరిమితం కాకుండా ఈసారి మిడ్‌-రేంజ్ ఫోన్లకు కూడా బీటా రోలౌట్‌ను విస్తరించడం విశేషం. ఈ బీటా ప్రోగ్రామ్‌లో చేరే ముందు మీ ఫోన్ డేటానంతా బ్యాకప్ చేసుకోవడం మంచిది. బీటా వర్షన్ సాఫ్ట్‌వేర్లలో కొన్ని రకాల లోపాలు ఉండే ప్రమాదం ఉంది. ప్లే ఇంటిగ్రిటీ చెక్స్ వైఫల్యం వల్ల కొన్ని బ్యాంకింగ్, UPI యాప్‌లు సరిగ్గా పనిచేయకపోవచ్చు. బీటా వెర్షన్లలో 'ట్యాప్ టు పే' ఫీచర్ సరిగ్గా పనిచేయకపోవచ్చని గూగుల్ స్వయంగా హెచ్చరిస్తోంది. ఒకవేళ మీరు మళ్లీ పాత వెర్షన్‌కు మారాలనుకుంటే, శామ్‌సంగ్ మెంబర్స్‌లో విత్‌డ్రా అయిన తర్వాత పిసిలో స్మార్ట్ స్విచ్ యాప్ వాడాల్సి ఉంటుంది.మొదట Samsung Members యాప్ తెరవండి. హోమ్‌పేజీలో కనిపించే One UI 9 Beta బ్యానర్‌పై క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. నిబంధనలను అంగీకరించి సబ్మిట్ చేయండి. ఆ...

సోల్ ప్రొప్రైటర్లు, చిన్న వ్యాపార యజమానుల కోసం అమెజాన్ పే కోటక్ బిజినెస్ క్రెడిట్ కార్డు

Image
సోల్ ప్రొప్రైటర్లు, చిన్న వ్యాపార యజమానుల కోసం అమెజాన్ పే కోటక్ బిజినెస్ క్రెడిట్ కార్డును తీసుకొచ్చాయి. లక్షలాది భారతీయ వ్యాపారాలకు సేవలందిస్తున్న డిజిటల్ ప్రొక్యూర్‌మెంట్ ప్లాట్‌ఫామ్ అయిన అమెజాన్ బిజినెస్‌లో నమోదైన వినియోగదారులకు ఇది అందుబాటులో ఉంటుంది. ఈ కార్డు క్యాష్‌బ్యాక్ రివార్డులను, పొడిగించిన వడ్డీ రహిత రుణ కాలాన్ని అందిస్తుంది. ఇది వ్యాపారవేత్తలు తమ వర్కింగ్ క్యాపిటల్‌ను కాపాడుకుంటూ, వ్యాపార కొనుగోళ్లను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. ఉద్యమ్ పోర్టల్‌లో నమోదైన 94 మిలియన్లకు పైగా సంస్థలతో కూడిన భారతదేశపు ఎంఎస్ఎంఈ రంగం, దేశ GDPలో 30% కంటే ఎక్కువ వాటాను అందిస్తోంది. అయినప్పటికీ, చాలా మంది చిన్న వ్యాపార యజమానులకు వారి వ్యాపార అవసరాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన వ్యవస్థీకృత రుణ ఉత్పత్తులు అందుబాటులో లేవు. వ్యాపారవేత్తలు డిజిటల్ ప్రొక్యూర్‌మెంట్, జీఎస్టీ అనుకూల రికార్డుల నిర్వహణ, వ్యవస్థీకృత ఆర్థిక ప్రక్రియలను ఎక్కువగా అవలంబిస్తున్నందున, ఖర్చులు, నగదు ప్రవాహాలు, వ్యాపార కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడంలో వారికి సహాయపడే ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. అమె...

ఇండియన్ ట్రేడ సర్వీస్ అధికారిని నిర్బంధ పదవీ విరమణ చేయించే నిర్ణయాన్ని రద్దు చేసిన సుప్రీంకోర్టు : ₹15 లక్షల పరిహారాన్ని చెల్లించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశం

Image
మాజీ ఇండియన్ ట్రేడ్ సర్వీస్ అధికారిని నిర్బంధ పదవీ విరమణ చేయించే నిర్ణయాన్ని సుప్రీంకోర్టు పూర్తిగా రద్దు చేసింది. ఈ చర్యను ఏకపక్షమైనది, దురుద్దేశపూర్వకమైనదిగా పేర్కొంది. సదరు అధికారికి మొత్తం ₹15 లక్షల పరిహారాన్ని చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందులో పరువు నష్టం కింద ₹9 లక్షలు, న్యాయపరమైన ఖర్చుల నిమిత్తం ₹6 లక్షలు ఉన్నాయి. అంతేకాకుండా పరిహారంతో పాటు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అధికారిని గౌరవపూర్వకంగా కార్యాలయానికి పిలిపించి, పూర్తి గౌరవ మర్యాదలతో వీడ్కోలు పలకాలని కూడా కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. 1989 బ్యాచ్‌కు చెందిన ఈ అధికారి అత్యుత్తమ, మచ్చలేని సేవా రికార్డును కలిగి ఉన్నారన్న విషయాన్ని గమనించాలి. ఆయన నిరంతరం అద్భుతమైన పనితీరు రేటింగ్‌లను పొందారు. ఫిబ్రవరి 2018లో ఆయన ప్రతిభ, యూపీఎస్ఈ ఆమోదం ఆధారంగా 'జాయింట్ సెక్రటరీ' స్థాయికి పదోన్నతి పొందారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పదోన్నతి పొందిన కేవలం రెండు నెలల తర్వాత అంటే 2018 మే 10న నిర్ణీత పదవీ విరమణ వయసుకు దాదాపు ఐదేళ్ల ముందే, 'ఫండమెంటల్ రూల్ 56(j)' కింద ఆయనను నిర్బంధ పదవీ విరమణ చేయించార...