Posts

Showing posts with the label 'E20 Janata Party' Digital Movement

'E20 జనతా పార్టీ' డిజిటల్ ఉద్యమం

Image
దే శంలో ఇటీవల 'కాక్రోచ్ జనతా పార్టీ' వంటి ఆన్‌లైన్ ట్రెండ్స్ వెలుగులోకి వచ్చిన స్ఫూర్తితో, తాజాగా సోషల్ మీడియా వేదికగా 'E20 జనతా పార్టీ' పేరుతో మరో నూతన ఆన్‌లైన్ ప్రచారం ఊపందుకుంది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌లో 20% ఇథనాల్ కలుపుతూ విక్రయించడాన్ని నిరసిస్తూ, వినియోగదారులకు 100% స్వచ్ఛమైన పెట్రోల్‌ను ఎంచుకునే ప్రత్యామ్నాయాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తూ వాహనదారులు, ముఖ్యంగా యువత డిజిటల్ వేదికలపై ఉద్యమిస్తున్నారు. ఇథనాల్ బ్లెండింగ్ ప్రక్రియ వల్ల వాహన రంగంలో పలు సమస్యలు ఎదురవుతున్నాయని వాహనదారులు, నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఇథనాల్‌లో సాధారణ పెట్రోల్ కంటే కలోరిఫిక్ విలువ తక్కువగా ఉండటం వల్ల వాహనాల మైలేజీ గణనీయంగా తగ్గుతోందని వినియోగదారులు పేర్కొంటున్నారు. పాత వాహనాలు లేదా E20కి పూర్తి స్థాయిలో అనుకూలంగా లేని ఇంజిన్లలో పార్టులు త్వరగా పాడవుతున్నాయని, తుప్పు పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ యూట్యూబర్ సౌరవ్ జోషి తన మెర్సిడీజ్ బెంజ్ ఎస్‌యూవీలో E20 పెట్రోల్ వాడటం వల్ల ఇంజిన్ లోపాలు తలెత్తాయని వీడియో విడుదల చేయడంతో ఈ అంశం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అయితే, తమ BS6 ...