ముంబై క్లైమేట్ వీక్లో పాల్గొనున్న సీఎం రేవంత్ రెడ్డి
ముంబై, బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని జియో కన్వన్షన్ సెంటర్లో సదస్సు ముంబై క్లైమెట్ వీక్ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సదస్సులో పాల్గొనడానికి ముంబైకి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రత్యేక ఆహ్వానం మేరకు ముంబై క్లైమెట్ వీక్ కార్యక్రమంలో హజరు కానున్నారు. ఈ సదస్సు మూడు రోజుల పాటు జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, హైదరాబాద్ విస్తృత ప్రగతి, రాష్ట్ర విజయాలను ఈ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు.