'ఎక్స్' లో 1.9 లక్షల అకౌంట్స్ పై నిషేధం ?
మే 26 నుంచి జూన్ 15 మధ్య కంపెనీ నియమాలను పాటించకపోవడం వల్ల భారతదేశంలో ఏకంగా 194053 ఖాతాలను నిషేధించినట్లు సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ ఎక్స్ (ట్విటర్) పేర్కొంది. కొత్త ఐటీ రూల్స్ 2021 ప్రకారం మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ తన ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా ఖాతాలను తొలగించింది. వచ్చిన మొత్తం ఫిర్యాదులలో 12570 భారతదేశం నుంచి వచ్చినట్లు సమాచారం. ఇందులో సెన్సిటివ్ అడల్ట్ కంటెంట్, వేధింపులు వంటి వాటికి సంబంధించినవి మాత్రమే కాకుండా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే చర్యలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.