Ad Code

ఏప్రిల్ 9న నోవా 2 5G, నోవా 2 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌లు విడుదల


దేశీయ మార్కెట్లో ఏప్రిల్ 9న ఏఐ+ త్వరలో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయబోతోంది. ఈ సంస్థ బడ్జెట్ ధరలలో ఏఐ+ నోవా 2 5G, నోవా 2 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయనుంది. నోవా సిరీస్‌కు చెందిన రాబోయే స్మార్ట్‌ఫోన్‌లు 5 కలర్ ఆప్షన్స్ లో అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. అంతకుముందు, ఈ సంస్థ గత సంవత్సరం జూలైలో నోవా 5G స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను విడుదల చేసింది. నోవా 2 5G, నోవా 2 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌లు భారత్ లో విడుదల కానున్నాయని మాధవ్ సేథ్ ‘X’ అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ధృవీకరించారు. టీజర్ ప్రకారం, నోవా 2 అల్ట్రా 5G బ్లాక్, బ్లూ, గ్రీన్, పర్పుల్, రెడ్ కలర్ లో లభిస్తుంది. నోవా 2 5G బ్లాక్, బ్లూ, గ్రీన్, పింక్, పర్పుల్ షేడ్స్‌లో వస్తుంది. ఈ రెండు నోవా సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో రెడ్ పవర్ బటన్ ఉంటుంది. ఏఐ+ నోవా 2 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌లో పిల్ షేప్ లో ఉండే రియర్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది. ఈ ఫోన్‌లో LED ఫ్లాష్ ఉంది. రాబోయే ఏఐ+ ఫోన్‌లో రింగ్ లైట్ కూడా ఉంది, ఇది కాల్స్, మెసేజ్‌లు, మ్యూజిక్, ఇతర నోటిఫికేషన్‌లను హైలైట్ చేస్తుంది. ఇది కొంతవరకు నథింగ్ ఫోన్‌ను పోలి ఉంటుంది. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌లను గత సంవత్సరం జూలైలో వరుసగా రూ. 4,999, రూ. 7,999 ధరలకు విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో 6.7-అంగుళాల HD+ డిస్‌ప్లే, NxtQuantum NxtQ OS ఉన్నాయి. ఏఐ+ పల్స్ ఫోన్‌లో Unisoc T615 ప్రాసెసర్ ఉండగా, ఏఐ+ నోవా 5Gలో Unisoc T8200 చిప్ ఉంది. ఈ రెండు ఫోన్‌లలో డ్యూయల్ రియర్ కెమెరాలు, 5000mAh బ్యాటరీ ఉన్నాయి. ఇవి 18W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి.

Post a Comment

0 Comments

Close Menu