పెట్రోల్ పై లీటరుకు రూ.100 సబ్సిడీ ప్రకటించిన పాకిస్తాన్ ప్రభుత్వం
పా కిస్తాన్ లో పెట్రోల్ కొనుగోలుపై ప్రజలకు లీటరుకు రూ.100 సబ్సిడీ అందించనున్నట్లు ప్రధానమంత్రి షరీఫ్ తెలిపారు. పాకిస్తాన్లో పెట్రోల్ ధరలు ఇప్పటికే లీటరుకు రూ.370కి చేరుకున్న విషయం తెలిసిందే. ప్రధానమంత్రి కార్యాలయం జారీ చేసిన ఒక ప్రకటన ప్రకారం, ఈ కష్ట సమయంలో తాము ప్రజలను అందుకుంటామని షరీఫ్ అన్నారు. ఈ పథకం కింద ద్విచక్ర, త్రిచక్ర వాహన డ్రైవర్లకు ప్రతి నెలా కొనుగోలు చేసే గరిష్టంగా 20 లీటర్ల పెట్రోల్పై లీటరుకు 100 పాకిస్తానీ రూపాయల సబ్సిడీ అందిస్తారు. 800 సిసి వరకు ఉన్న చిన్న కార్ల యజమానులు ప్రతి నెలా గరిష్టంగా 30 లీటర్ల పెట్రోల్పై లీటరుకు 100 పాకిస్తానీ రూపాయల సబ్సిడీని పొందుతారు. ఈ సబ్సిడీ తర్వాత ప్రజలు లీటరు పెట్రోల్కు సుమారు 270 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్లో పెట్రోల్ ధర ప్రస్తుతం లీటరుకు 370 పాకిస్తానీ రూపాయలకు పైగా ఉండి, నిరంతరం హెచ్చుతగ్గులకు లోనవుతోంది. ఈ పథకాన్ని ప్రారంభిస్తూ పెట్రోలియం ధరల పెరుగుదల కారణంగా ప్రజలపై పడుతున్న భారం గురించి ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉందని షాబాజ్ షరీఫ్ అన్నారు. ఈ పథకం సోమవా...