Posts

Showing posts with the label Telugu and Tamil audiences are embracing the film

ఊహించని విధంగా వసూళ్లు రాబడుతున్న మండాడి

Image
మం డాడి సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా వసూళ్లు రాబడుతోంది. బడా చిత్రాలు థియేటర్‌లలో ఉన్నప్పటికీ తన మార్క్ చూపిస్తోంది. కథ, కథనానికి తోడు సుహాస్- సూరిల నటనకు తెలుగు, తమిళ ప్రేక్షకులు మండాడికి బ్రహ్మరథం పడుతున్నారు. సెప్టెంబర్ 10న మండాడి చిత్రం వరల్డ్ వైడ్‌గా విడుదలైంది. మండాడిలో మహిమా నంబియార్, సత్యరాజ్, మిథున్, జై శంకర్, రవీంద్ర విజయ్, బాల శరవణన్, స్టన్ శివ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మాథిమారన్ పుగళేంది ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆర్ఎస్ ఇన్‌ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై ఎల్‌రెడ్ కుమార్, వెట్రీమారన్‌లు సంయుక్తంగా నిర్మించారు. ఎస్ఆర్ కథిర్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ప్రదీన్ ఈ రాఘవ్ ఎడిటర్‌గా వ్యవహరించారు. మండాడి చిత్రాన్ని 70 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించినట్లుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 150 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. తొలిరోజు సూరి మూవీకి 4.85 కోట్ల రూపాయలు, రెండో రోజు 6.55 కోట్ల రూపాయలు చొప్పున ఇండియాలో రెండ్రోజుల్లో 11.40 కోట్ల రూపాయల నెట్.. 13.35 కోట్ల రూప...