ఆంధ్రప్రదేశ్ లోని పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీ విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. సోకిలేరు వ్యూ పాయింట్ వద్ద వాగులో ఈతకు వెళ్లిన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంకు చెందిన పెండెం కళ్యాణ్, పెండెం బాబీ అనే ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న మోతుగూడెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
0 Comments