Posts

Showing posts with the label NEET Paper Leak

నీట్ పేపర్ లీకేజీ : దోషరహిత పరీక్షా వ్యవస్థను నిర్మించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచన

Image
ఎ న్డీఏ ఎంపీల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ  మాట్లాడుతూ పేపర్ లీకేజీలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు అమలు చేయాలని ఆయన కోరారు. దోషరహిత పరీక్షా వ్యవస్థను నిర్మించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. రాజకీయ భిన్నాభిప్రాయాలు పక్కనపెట్టి అందరూ కలిసి పనిచేయాలని చెప్పారు. దేశ భవిష్యత్తు అలాగే యువత సంక్షేమం అత్యంత ముఖ్యమని మోడీ తెలిపారు. యువతను తప్పుదారి పట్టించే పనులు అసలు చేయవద్దని హెచ్చరించారు. పిల్లలను అనవసరంగా రెచ్చగొట్టడం సరికాదని స్పష్టం చేశారు. వారికి సరైన మార్గాన్ని చూపించి మంచి భవిష్యత్తును అందించాలని రాజకీయ నేతలను కోరారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. వ్యవస్థలో మార్పుల కోసం అందరి మద్దతు అవసరమని ఆయన పునరుద్ఘాటించారు.

నీట్ పేపర్ లీక్ : రిట్ పిటిషన్ల కాపీలను సొలిసిటర్ జనరల్‌కు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశం

Image
నీట్ యూజీ పరీక్ష  పేపర్ లీక్ వివాదంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో గతంలో తలెత్తిన వివాదాల సందర్భంగా సిఫార్సు చేసిన సంస్కరణల అమలుపై జాతీయ టెస్టింగ్ ఏజెన్సీకి సూటి ప్రశ్నలు వేసింది. ఈ మేరకు నీట్ పరీక్షకు సంబంధించి దాఖలైన పిటిషన్లలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అలాగే వారు దాఖలు చేసిన రిట్ పిటిషన్ల కాపీలను సొలిసిటర్ జనరల్‌కు సమర్పించాలని ఆదేశించింది. నీట్ పేపర్ లీక్ పై దాఖలైన పిటిషన్లపై విచారణలో పిటిషనర్ల తరఫున హాజరైన లాయర్ తన్వి దూబే.. ఈ కేసు ప్రాధాన్యతను సుప్రీంకోర్టుకు గుర్తుచేశారు. వైద్య కోర్సులలో ప్రవేశం కోసం నిర్వహించే నీట్-యూజీ పరీక్షకు సుమారు 23 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారని, ఇది వారి భవిష్యత్తుకు సంబంధించిన అంశమని ఆమె కోర్టుకు తెలిపారు. కాబట్టి ఈ పిటిషన్ పై విచారణ త్వరితగతిన చేపట్టాలని, విచారణకు త్వరగా తేదీని కేటాయించాలని దూబే కోర్టును కోరారు. అయితే కోర్టు ప్రస్తుత వివాదానికి మించి, పరీక్షా ప్రక్రియలకు సంబంధించిన గత ఆందోళనల తర్వాత ప్రవేశపెట్టిన గత సంస్కరణ చర్యల అమలుపై దృష్టి సారించింది. ఈ మేరకు వారు గుణపాఠాలు నేర్చుక...