Ad Code

ఆగస్టు 6న ‘రెడ్‌మీ నోట్ 17’ను విడుదల

దేశీయ మార్కెట్లో షియోమీ ఆగస్టు 6న ‘రెడ్‌మీ నోట్ 17’ను విడుదల చేస్తుంది. దీనిలో 8000mAh భారీ బ్యాటరీని అందించడం ఈ ఫోన్ ప్రధాన ప్రత్యేకత. ఇది వినియోగదారులకు సుదీర్ఘ బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. దీనితో పాటు ఫొటోగ్రఫీ కోసం 50 మెగాపిక్సెల్ AI కెమెరా, ఐపీ69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్, సరికొత్త హైపర్‌ఓఎస్ 3 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ రానుంది. ఈ ఫోన్‌లో 7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. ఇది గేమింగ్, వీడియా వీక్షణకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. పనితీరు కోసం క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 ప్రొసెసర్‌ను ఉపయోగించినట్లు తెలుస్తోంది. కనెక్టివిటీ పరంగా 5G, వైఫై 6, బ్లూటూత్ 5.1, ఎన్‌ఎఫ్‌సీ, టైప్-సి పోర్ట్‌లతో పాటు డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసే స్టీరియో స్పీకర్లు, ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉన్నాయి. 

Post a Comment

0 Comments

Close Menu