తెలుగు రాష్ట్రాల సీఎంలు కలిసి మెలిసి రాష్ట్రాల అభివృద్ధి కోసం పనిచేయాలి !
తె లుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పరం సహకరించుకుంటూ అభివృద్ధిలో కలిసి ముందుకు సాగాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు సూచించారు. అలయ్ బలయ్ అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి అధ్యక్షతన హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో దసరా సమ్మేళనం 2024 ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఢంకా మోగించగా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.తెలుగు రాష్ట్రాల సీఎంలు కలిసి మెలిసి రాష్ట్రాల అభివృద్ధి కోసం పనిచేయాలని అన్నారు. రాజకీయాలకీతంగా పరస్పరం సహకరించుకుని, ఐకమత్యంతో ముందుకు సాగాలన్నారు. దేశంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అగ్రస్థానంలో నిలపాలని సీఎంలకు సూచించారు. రాజకీయాలతో సంబంధం లేకుండా 2005లో అలయ్ బలయ్ ప్రారంభించామని తెలిపిన బండారు దత్తాత్రేయ.. ప్రేమ, ఆత్మీయత, ఐక్యత చాటిచెప్పాలన్నదే దీని లక్ష్యమని తెలిపారు. ఈసారి కులవృత్తులకు ప్రాధాన్యతనిస్తూ అలయ్ బలయ్లో ప్రదర్శించామని తెలిపారు. అనంతరం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ...