ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల్లోని పలు ప్రాంతాల్లో అడవి మంటలు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఎన్నడూ లేని స్థాయిలో ఎగసిపడుతున్న ఈ మంటల దెబ్బకు రెండు దేశాల్లో సుమారు రెండు లక్షల మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లినట్లు ది గార్డియన్ కథనం పేర్కొంది. వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు, బలమైన గాలుల కారణంగా ఈ మంటలు అత్యంత వేగంగా విస్తరిస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సైతం ఈ పరిస్థితిని అదుపు చేయలేక తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఫ్రాన్స్లోని ప్రముఖ నగరమైన బోర్డియక్స్ (Bordeaux) శివారు ప్రాంతాలు, జిరోండే సమీపంలో మంటలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. వేసవి సెలవులు గడిపేందుకు వచ్చిన పర్యాటకులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రంగంలోకి దిగి సైన్యాన్ని మోహరించారు. యూరోపియన్ యూనియన్ సహాయం కూడా కోరారు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ సమీపంలో కూడా మంటలు తీవ్రంగా చెలరేగడంతో ఆ దేశ ప్రధాని పెడ్రో సాంచెజ్ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
0 Comments