యుద్ధం ఆపేందుకు కేంద్రం చొరవ తీసుకోవాలి : తెలంగాణ అసెంబ్లీ తీర్మానం


తెలంగాణ అసెంబ్లీలో యుద్దం ఆపేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సోమవారం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్, లెబనాన్ మీద దాడి చేస్తున్నాయని, ఇరాన్ కూడా గల్ఫ్, మిడిల్ ఈస్ట్ దేశాలలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను టార్గెట్‌గా చేసుకొని దాడి చేస్తున్నదని తెలిపారు. ఫైటర్ బాంబర్సు, బాలెస్టిక్ మిస్సైల్స్, డ్రోన్స్ వంటి అత్యంత ఆధునికమైన ఆయుధాలతో పరస్పర దాడులు చేసుకుంటున్నాయని, దీనివల్ల జరిగే విధ్వంసంలో అమాయకులు దాదాపు 4,000 మందిమరణించారని తెలిపారు. ఈ మరణాలతోపాటు, ఆర్థికపరమైన విధ్వంసం మరొక పక్కన జరుగుతున్నదన్నారు. మరణాలు అయా దేశాలకు మాత్రమే పరిమితమైతే ఆర్థిక విధ్వంసం ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తున్నదన్నారు. మరీ ముఖ్యంగా ఆసియా దేశాలకు మరింత ప్రమాదకరంగా మారిందని, మన దేశంపైన కూడా తీవ్రమైన ప్రభావం చూపుతోందని, కనీసం ఇంతటితోనైనా ఈ యుద్దాన్ని ఆపకపోతే ప్రపంచ భవష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్దం ఇలాగే కొనసాగినా ఆపకపోయినా ఇది మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారితీయవచ్చునన్నారు. ఇది ప్రపంచ మానవాళి మనుగడకే ముప్పు అని, ఇటువంటి అత్యంత ప్రమాదకర పర్యవసనాల దృష్ట్యా భారత ప్రభుత్వం చొరవ తీసుకుని యుద్ధాన్ని ఆపడానికి, ప్రపంచ శాంతిని నెలకొల్పడానికి తగిన చొరవ తీసుకోవాలని సభ ద్వారా కోరుతూ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని చెప్పారు. అనంతరం సభ ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం