పశ్చిమ బెంగాల్ అటవీ ప్రాంతంలో ఒకే చోట నాలుగు మానవ అస్థిపంజరాలు లభ్యం
ప శ్చిమ బెంగాల్లోని పశ్చిమ బర్ధమాన్ జిల్లా కంకాసా పోలీస్ స్టేషన్ పరిధిలోని మలాన్ దిఘి అటవీ ప్రాంతంలో ఒకే చోట నాలుగు మానవ అస్థిపంజరాలు లభ్యం కావడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పశ్చిమ బర్ధమాన్ జిల్లా మలాన్ దిఘి పరిధిలోని జాఠ్గఢియా మోడ్ సమీపంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో స్థానికులు సంచరిస్తున్న సమయంలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. అడవి లోపల విసిరేసినట్లు పడి ఉన్న మానవ అస్థిపంజరాలను చూసి తీవ్ర భయాందోళనకు గురైన వారు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కంకాసా పోలీస్ స్టేషన్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించినప్పుడు అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగుచూశాయి. అస్థిపంజరాలు పడి ఉన్న ప్రదేశానికి సరిగ్గా పైన ఉన్న ఒక పెద్ద చెట్టుకు నాలుగు ఉరితాళ్లలా వేలాడుతూ కనిపించాయి. అంతేకాకుండా ఆ చెట్టు కింద ఒక నైలాన్ బ్యాగ్ పడి ఉండటాన్ని అధికారులు గుర్తించారు. లభ్యమైన అవశేషాల పరిమాణాన్ని బట్టి అందులో ఒకటి చిన్నపిల్లల అస్థిపంజరం అయి ఉండ...