అంతరిక్షం లో కనువిందు చేయబోతున్న అద్భుతం : భూ కక్ష్యకు దగ్గర రాబోతున్న C/2024 E1 తోక చుక్క


గోళ అద్భుతం కనువిందు చేయబోతోంది. మన జీవిత కాలంలో ''తోక చుక్కల''ను కనీసం ఒకసారి కూడా చూసే అవకాశం ఉండదు. అలాంటి ఒక తోకచుక్క, భూ కక్ష్యకు దగ్గర రాబోతోంది. C/2024 E1 (వియర్జోష్) అనే తోకచుక్క ఆకాశంలో దర్శనం ఇవ్వనుంది. ఇది సౌర కుటుంబం వెలుపలి నుంచి వచ్చినట్లుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ తోకచుక్కనున 2024 మార్చిలో పోలాండ్ ఖగోళ శాస్త్రవేత్త కాస్పర్ వియర్జోష్ కనుగొన్నారు. ఇది ఓర్ట్ క్లౌడ్ అనే చాలా దూర ప్రాంతం నుంచి వచ్చింది. ఈ ప్రాంతంలో కొన్ని లక్షల ఏళ్ల నుంచి మంచు పదార్థం కలిగిన ఖగోళ వస్తువులు ఉంటాయి. ఈ తోకచుక్క ప్రయాణ మార్గం సాధారణంగా లేదు. సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి కారణంగా ఇది సౌరకుటుంబం నుంచి శాశ్వతంగా బయటకు వెళ్లిపోతుంది. అందుకే దీనిని ఒకసారి మాత్రమే చూడగలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జనవరి 20, 2026న సూర్యుడికి అత్యంత దగ్గరగా వచ్చింది. జనవరి 1, 2026లో శుక్రగ్రహానికి దగ్గరగా వెళ్లింది. ఫిబ్రవరి 17, 2026 భూమి కక్ష్యకు సమీపంగా వస్తోంది. శాస్త్రవేత్తల ప్రకారం, ఈ తోకచుక్కలో ప్రధానం కార్బన్ డయాక్సైడ్ వాయువు ఉంది. సాధారణంగా కనిపించే తోకచుక్కల్లో కనిపించే కార్బన్ మోనాక్సైడ్ మాత్రం ఇందులో కనిపించలేదు. దీని న్యూక్లియస్ 2 నుంచి 10 కిలోమీటర్ల వెడల్పు ఉండొచ్చని అంచనా. సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు దీని చుట్టూ వాయువు, ధూళితో కూడి మేఘం ఏర్పడుతుంది. దీని తోక ఆకాశంలో కనిపిస్తుంది. దీని వెలుతురు 6.5-7 మ్యాగ్నట్యూడ్‌గా ఉండొచ్చు. బైనాక్యులర్స్ లేదా చిన్న టెలిస్కోపుల ద్వారా చూడవచ్చు. ఫిబ్రవరి 2026 ప్రారంభంలో కూడా ఈ తోకచుక్క కనిపించే అవకాశం ఉంది. భారతదేశ దక్షిణ ప్రాంతాల్లో సూర్యస్తమయం తర్వాత దక్షిణ-పడమర దిశలో తక్కువ ఎత్తులో కనిపించవచ్చు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం