ఎలక్ట్రిక్ వాటర్ టాక్సీ !
బ్రిటన్కు చెందిన ఆర్టెమిస్ టెక్నాలజీస్ సంస్థ 'ఈఎఫ్-12 ఎస్కేప్' పేరుతో ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది.ఇందులో ఇద్దరు సిబ్బంది కాకుండా, మరో పన్నెండుమంది ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు.దీని గరిష్ఠవేగం గంటకు 52 నాటికల్ మైళ్లు (96.3 కి.మీ.). ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనం కావడం వల్ల పూర్తిగా పర్యావరణ అనుకూలమైనదని, ప్రయాణికుల జల రవాణాలో ఇది విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాగలదని ఆర్టెమిస్ ప్రతినిధులు చెబుతున్నారు. దీని ధర 3.75 లక్షల డాలర్లు. https://t.me/offerbazaramzon
Comments
Post a Comment