Posts

Showing posts with the label Son dealing with his health issues

లండన్‌లో భారత సంతతి కుటుంబం మృతి

Image
భా రత సంతతికి చెందిన 47 ఏళ్ల రాకేష్ నారాయణ్ పాయ్, 46 ఏళ్ల అదితి విజయ్ పారాల్కర్‌లు భార్యాభర్తలు. వీరికి తొమ్మిదేళ్ల కుమారుడు సిద్ పాయ్ పారాల్కర్ ఉన్నాడు. వీరంతా దక్షిణ లండన్‌లోని ఎలిఫెంట్ అండ్ క్యాజిల్ పరిధిలోని చర్చియార్డ్ రోలో ఉన్న 'హైపాయింట్' అనే 45 అంతస్తుల విలాసవంతమైన అపార్ట్‌మెంట్ టవర్‌లోని 36వ అంతస్తులో నివాసం ఉంటున్నారు. అయితే మే 27వ తేదీ ఉదయం సుమారు 7.30 గంటల సమయంలో వీరు ముగ్గురూ 36వ అంతస్తు నుంచి కింద పడ్డారు. ఒక్కసారిగా భారీ శబ్దం అవుతూ వారు కింద పడడాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే వారి వద్దకు పరుగులు పెట్టారు. మెట్రోపాలిటన్ పోలీస్ అధికారులతో పాటు లండన్ అంబులెన్స్ సర్వీస్, ఎయిర్ అంబులెన్స్, ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలపాలైన ఆ ముగ్గురిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వీరంతా ఆత్మహత్య చేసుకున్నారా, లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో బ్రిటన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే బ్రిటీష్ మీడియా కథనాల ప్రకా...