Posts

Showing posts with the label SIDBI Anniversary Event

కొంతమంది అంత కుప్పకూలిపోతుందని లేనిపోని అపోహలు ప్రచారం చేస్తున్నారు !

Image
ముం బైలో జరిగిన సిడ్బి వార్షికోత్సవ కార్యక్రమంలో  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ అంతర్జాతీయ ఒడిదొడుకుల దృష్ట్యా ప్రస్తుతం ప్రభుత్వం ఇంధనం, ఎరువులు, విదేశీ  మారక నిల్వలు వంటి మూడు కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని ప్రధాని మోడీ స్పష్టం చేసినట్లు, దేశీయ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ ఎంతో బలంగా, స్థిరంగా ఉన్నప్పటికీ, కొంతమంది మేధావులు, విమర్శకులు అంతా కుప్పకూలిపోతోందనేలా లేనిపోని అపోహలను ప్రచారం చేస్తున్నారని ఆమె ఆక్షేపించారు. అంతర్జాతీయంగా ఎదురవుతున్న ఇబ్బందులను ఎదుర్కొంటూనే, దేశ ప్రజలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఈ సందర్భంగా ఆమె హితవు పలికారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ, దేశీయంగా సామాన్యులపై మరియు పారిశ్రామిక రంగంపై ఆ భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోందని నిర్మలా సీతారామన్ వివరించారు. ఇందులో భాగంగానే పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్ సుంకాన్ని (Excise Duty) భారీగా తగ్గించామని, దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి రావాల్సిన సుమారు రూ. లక్ష కోట్ల ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తోందని ఆమె వెల్లడించార...