₹6000 జీతంతో మొదలుపెట్టి 'కుబేరుడు'గా మారిన ఒడిశా ప్రభుత్వ ఇంజనీర్
ఒ డిశా ప్రభుత్వ ఇంజనీర్ బైకుంఠ నాథ్ బెహెరాకు చెందిన పలు నివాసాలు, కార్యాలయాలపై విజిలెన్స్ బృందం ఏకకాలంలో దాడులు నిర్వహించింది. సదరు ఇంజనీర్ తన ఉద్యోగ కాలంలో సంపాదించిన చట్టబద్ధమైన ఆదాయ వనరుల కంటే చాలా రెట్లు ఎక్కువ ఆస్తులను కూడబెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సోదాలలో కోట్ల విలువైన నగదు, బంగారం మరియు ఆస్తులు లభ్యమయ్యాయి. ఒడిశా విజిలెన్స్ అధికారులు శనివారం కంధమాల్ జిల్లా బాలిగూడలోని ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కి సంబంధించిన తొమ్మిది ప్రాంతాలలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈ చర్య తీసుకున్నారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. విజిలెన్స్ సాంకేతిక విభాగం (టెక్నికల్ వింగ్) గుర్తించిన భవనాలు మరియు ప్లాట్ల కొలతలను, వాటి విలువను అంచనా వేస్తోంది. ఈ దాడుల సమయంలో అవినీతి నిరోధక శాఖ సిబ్బంది నిందితుడి నుండి ₹2,66,400 నగదును ప్రాథమికంగా స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు భారీగా బంగారు, వెండి ఆభరణాలు, వేర్వేరు బ్యాంకులలో ఉన్న రెండు లాకర్లు మరియు బ్యాంక్ డిపాజిట్లను కూడా కనుగొన్నారు, ప్రస్తుతం వాటి లెక్కింపు జరుగుతోంది. పూ...