ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే రాష్ట్ర భద్రతనమమతా బెనర్జీ ఫణంగా పెడుతున్నారు !
ప శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కూచ్ బిహార్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన తొలి భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగిస్తూ చొరబాటుదారులకు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా మద్దతు తెలుపుతోందని, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్ర భద్రతను పణంగా పెడుతున్నారని ఆయన ఆరోపించారు. రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ రోజున ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, టీఎంసీ నాయకులు బెదిరింపులకు పాల్పడినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ధైర్యంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన తీసుకురావడానికి ప్రజలంతా బీజేపీకి అండగా నిలవాలని ఆయన కోరారు. బెంగాల్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న ఈ అవినీతి ప్రభుత్వాన్ని శాశ్వతంగా సాగనంపే సమయం ఆసన్నమైందని ప్రధాని మోడీ ప్రజలకు స్పష్టం చేశారు. టీఎంసీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను కనీసం లెక్కచేయడం లేదని ప్రధాని మోడీ మండిపడ్డారు. మాల్డాలో రెండు మూడు రోజుల క్రితం జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనమని గుర్తు చే...