Posts

Showing posts with the label MDMK

సీఎం విజయ్ నేతృత్వంలోని కూటమి పేరు 'సెక్యులర్‌ సోషల్‌ జస్టిస్‌ విక్టరీ అలయన్స్‌' గా ఖరారు

Image
త మిళనాడు లో తమిళగ వెట్రి కళగం కూటమి ప్రభుత్వానికి 'సెక్యులర్‌ సోషల్‌ జస్టిస్‌ విక్టరీ అలయన్స్‌' అనే పేరును నిర్ణయించారు. ఈ విషయాన్ని టీవీకే చీఫ్‌ విజయ్‌, వీసీకే చీఫ్‌ తోల్‌ తిరుమావళన్‌, ఎండీఎంకే చీఫ్‌ వైకో, ఐయూఎంఎల్‌ నాయకులు మీడియా ముఖంగా వెల్లడించారు. చెన్నైలోని టీవీకే ప్రధాన కార్యాలయంలో బుధవారం కాంగ్రెస్‌, వీసీకే,ఎండీఎంకే, ఐయూఎంఎల్‌ పార్టీల నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీలోనే తమిళనాడు కూటమి ప్రభుత్వానికి ఈ పేరును ఖరారు చేశారు. అయితే,అనూహ్యంగా ఈ సమావేశానికి విజయ్‌ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన వామపక్ష పార్టీల నేతలు గైర్హాజరయ్యారు. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన రెండవ సమావేశం ఇది. కూటమి నిర్మాణాన్ని అధికారికంగా ఖరారు చేయడంపై ఈ భేటీ ప్రధానంగా దృష్టి సారించింది. ఉమ్మడి కార్యక్రమంలో రూపకల్పన, స్టీరింగ్ కమిటీ ఏర్పాటు, కన్వీనర్ నియామకం,కూటమికి అధికారిక పేరును ఖరారు చేయడం వంటి ముఖ్యమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరిగినట్లు సమాచారం. తమిళనాడులో సీఎం విజయ్‌ నేతృత్వంలోని టీవీకే కూటమి సమావేశానికి సీపీఐ,సీపీఎం వంటి వామపక్ష పార్టీలు గైర్హాజరు క...

చెన్నై జిల్లాలో 15 లక్షల ఓట్ల తొలగింపు ?

Image
చెన్నై జిల్లా పరిధిలోని 16 శాసనసభ నియోజకవర్గాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) పనులు గత నెల 4వ తేదీన ప్రారంభించారు. 3,718 మంది పోలింగ్‌ స్టేషన్‌ అధికారులను నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జి, పర్యవేక్షణ అధికారులుగా నియమించారు. ఈ క్రమంలో, లెక్కింపు ఫారాలు పొందే అంశంపై గురువారం స్థానిక రిప్పన్‌ భవనంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎంకే, ఎండీఎంకే, బీజేపీ, కాంగ్రెస్‌, సీపీఎం సహా 12 గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశంలో అధికారులు మాట్లాడుతూ చెన్నై జిల్లాలోని 40.04 లక్షల ఓటర్లలో 39.59 మందికి లెక్కింపు ఫారాలు అందజేశామన్నారు. వారిలో 22.79 లక్షల మంది నుంచి ఫారాలు పొందామని తెలిపారు. వారిలో 2.23 లక్షల మంది రెండు ఓట్లు కలిగి ఉన్నట్లు గుర్తించామన్నారు. అలాగే, 1.49 లక్షల మంది మృతిచెందిన జాబితాలో ఉన్నారని తెలిపారు. 8.39 లక్షల మంది శాశ్వతంగా వేరే నియోజకవర్గానికి మారారని, 36,979 మంది స్పందించలేని పరిస్థితుల్లో ఉన్నారని తెలిపారు. ఈ గణాంకాల ప్రకారం 25.99 శాతం మంది ఫారాలు అందించలేదని తెలుస్తుందని, ఈ కారణంగా 10.40ల లక్షల నుంచి 15 లక్షల మందిని ఓటర్ల జాబితాల నుంచి...