జయలలితకు చెందిన భవనాన్ని సీజ్ చేసిన జీహెచ్ఎంసీ అధికారులు
త మిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె. జయలలితకు చెందిన భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేయడం ఇప్పుడు తెలుగు, తమిళ రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ భవనానికి సంబంధించి సుమారు రూ. 25 లక్షల వరకు ఆస్తి పన్ను బకాయిలు ఉండటంతో, పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో అధికారులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. జయలలిత బతికున్న కాలంలో ఈ భవనం ఆమెకు ఒక ప్రధాన ఆస్తిగా ఉండేది, కానీ ఆమె మరణం తర్వాత ఈ ఆస్తి వారసత్వం, నిర్వహణపై సందిగ్ధత ఏర్పడింది. జయలలిత మరణం తర్వాత ఆమె వందల కోట్ల ఆస్తులకు వారసులు ఎవరనే అంశంపై సుదీర్ఘ న్యాయపోరాటం జరిగింది. 2020లో మద్రాస్ హైకోర్టు జయలలిత అన్న కుమారుడు జె. దీపక్, కుమార్తె జె. దీపలను ఆమెకు చట్టబద్ధమైన వారసులుగా ప్రకటించింది. ఈ తీర్పు ప్రకారం హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీ నివాసం, జీడిమెట్ల వద్ద ఉన్న ద్రాక్ష తోట తో పాటు ఇతర అన్ని స్థిరాస్తులు వీరిద్దరికే చెందుతాయి. కోర్టు వారసులుగా ప్రకటించినప్పటికీ, ఈ ఆస్తుల అప్పగింత ప్రక్రియ , ఆదాయపు పన్ను శాఖ జరిపిన అటాచ్మెంట్ల వల్ల వీరు పూర్తిస్థాయిలో వీటిని స్వాధీనం చేసుకోవడంలో జాప్యం జరుగుతూనే ఉంది. ప్రస్తుతం శ్రీనగర్ కాలనీలోని ఈ ...