చైనాలో రెడ్మీ పాడ్ ఎస్ఈ ట్యాబ్ విడుదల
చైనా మార్కెట్లో రెడ్మీ పాడ్ ఎస్ఈ పేరుతో సరికొత్త టాబ్లెట్ విడుదల చేసింది. రూ.20వేల ధరల విభాగంలో మార్కెట్లోకి వచ్చిన ఈ డివైజ్, మిడ్రేంజ్ ట్యాబ్ మార్కెట్పై ఫోకస్ చేస్తోంది. రెడ్మీ పాడ్ SE టాబ్లెట్లో 90Hz రిఫ్రెష్ రేట్తో 11 అంగుళాల IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఇది 1200 x 1920 పిక్సెల్ రిజల్యూషన్తో 400 నిట్స్ బ్రైట్నెస్ అందిస్తుంది. ఈ డివైజ్లో క్వాల్కమ్ SM6225 స్నాప్డ్రాగన్ 680 4G ప్రాసెస్ వినియోగించారు. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ MIUI 14 ఓఎస్తో ఇది రన్ అవుతుంది. ఈ హ్యాండ్సెట్లో ఆక్టా-కోర్ CPU, జీపీయూ Adreno 610 ఉంటుంది. డివైజ్ డైమెన్షన్స్ 255.5 x 167.1 x 7.4 mm (10.06 x 6.58 x 0.29 in) కాగా, బరువు 478 గ్రాములు ఉంటుంది. గ్లాస్ ఫ్రంట్, అల్యుమినియం బ్లాక్, అల్యుమినియం ఫ్రేమ్తో దీని బిల్ట్ చేశారు. కంపెనీ ఈ ప్రొడక్ట్లో ఎలాంటి సిమ్ స్లాట్ను ఆఫర్ చేయలేదు. ఈ టాబ్లెట్లో 8MP సింగిల్ రియర్ కెమెరా, ముందుభాగంలో 5MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ లెన్స్తో 1080p క్వాలిటీతో వీడియోలు షూట్ చేయవచ్చు. 24-bit/192kHz ఆడియో సపోర్ట్ కోసం డివైజ్లో నాలుగు స్టీరియో స్పీకర్స్, 3.5mm జాక్ను ఏర్పాటు చేశార...