నేపాల్ కి చెందిన 26 ఏళ్ల తయ్యబ్ ఖాన్ ఉపాధి కోసం అబుదాబిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ప్రతి నెలా వచ్చే కొద్దిపాటి జీతంతో కుటుంబ భారాన్ని మోస్తున్న అతను, తన ఐదుగురు స్నేహితులతో కలిసి ఒక వినూత్న ప్రయత్నం చేశాడు. అందరూ కలిసి 250 దిర్హమ్స్ వెచ్చించి ఒక లాటరీ టికెట్ను కొనుగోలు చేశారు. ఆ టికెట్టే వారి జీవితాలను ఊహించని మలుపు తిప్పుతూ ఏకంగా 30 మిలియన్ దిర్హమ్స్ బంపర్ ప్రైజ్ గెలుచుకుంది. ఈ భారీ మొత్తాన్ని స్నేహితులంతా సమానంగా పంచుకోగా, తయ్యబ్ ఖాన్ వాటాగా రూ. 15 కోట్ల భారీ నగదు చేతికి వచ్చింది. ఈ అపారమైన సంపదతో తయ్యబ్ ఖాన్ జీవిత కాల కలలన్నీ సాకారం కాబోతున్నాయి. లాటరీ గెలిచిన ఆనందంలో అతను తన భవిష్యత్తు ప్రణాళికలను పంచుకున్నాడు. లక్ష్మీదేవి కటాక్షించడంతో మొదటగా తాను చేస్తున్న సెక్యూరిటీ గార్డు ఉద్యోగానికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించాడు. నేపాల్లో ఉన్న తన కుటుంబం కోసం అన్ని వసతులతో కూడిన ఒక నివాస గృహాన్ని (ఇల్లు) నిర్మించడమే తన మొదటి ప్రాధాన్యత అని తెలిపాడు. ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి సొంతంగా వ్యాపారం ప్రారంభించి ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా సెటిల్ అవుతానని ధీమా వ్యక్తం చేశాడు. వీటన్నింటితో పాటు తనకు ఎంతో ఇష్టమైన మహీంద్రా థార్ కారును, ప్రతిష్టాత్మకమైన రోలెక్స్ వాచ్ను కొనుగోలు చేసి తన చిరకాల కోరికలను నెరవేర్చుకుంటానని సంతోషంగా చెప్పుకొచ్చాడు.
0 Comments